English | Telugu

ఎవరెన్ని పూజలు చేసినా లాస్ట్ లో మమ అనాల్సింది సుమ


సుమ అడ్డా నెక్స్ట్ వీక్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి "లవ్ మౌళి" మూవీ టీమ్ నుంచి నవదీప్, పంఖురి గిద్వాని, భావన, కిరణ్ వచ్చారు. ఇక ఈ షోలో సుమ గురించి ఫుల్ పాజిటివ్ కామెంట్స్ చేశారు ఈ మూవీ టీమ్. "జనరల్ గా సినిమా వాళ్ళు మొత్తం పూర్తయ్యాక పెద్దమ్మ గుడి దగ్గరకు వెళ్లి ఫంక్షన్ చేస్తారు... తర్వాత సుమమ్మ గుడికి రావాల్సిందే" అని కిరణ్ చెప్పేసరికి "ఎవరు ఎన్ని పూజలు చేసినా లాస్ట్ లో మమ అనాల్సింది సుమ" అంటూ నవదీప్ అద్భుతమైన డైలాగ్ అంటూనే "మొన్న చిరంజీవి గారి కోటు కొట్టేయడమే నచ్చలేదు" అని నవదీప్ చెప్పి సుమనే ఆ కోటు కొట్టేసిందని తెలిసి కొంచెం ఫీల్ అయ్యాడు.

ఇక ప్రోమో స్టార్టింగ్ లో ప్రోగ్రాం లింక్ ని నవదీప్ చెప్పేసాడు "వెల్కమ్ టు సుమా అడ్డా..ఈరోజుకు ఇది మౌళి గాడి అడ్డా" అని చెప్పాడు. "మౌళి మీరు ప్రేమను వెతుకుతూ తిరుగుతున్నారని అర్ధమయ్యింది..." అని సుమా అడిగేసరికి "చిన్నప్పటినుంచి వెతుకుతూనే ఉన్నాను..దొరుకుతున్నట్టే దొరుకుతుంది మళ్ళీ దొరకట్లేదు" అన్నాడు నవదీప్. "అదేంటి మా షోనే లవ్వు...మా షో అంటేనే ప్రేమ" అని సుమా చెప్పింది. "అబ్బాయిలు అమ్మాయిలను ఎలా సెలెక్ట్ చేస్తారు" అంటూ సుమ నవదీప్ ని అడిగేసరికి తెగ సిగ్గు పడిపోయాడు పాపం. "టైం ఐనా, గర్ల్ ఫ్రెండ్ ఐనా ఎవరి కోసమూ ఆగదు" అని సుమా చెప్పేసరికి "నేనస్సలు ఆగను" అన్నాడు నవదీప్. ఇక భావనతో మాట్లాడింది సుమ "ఐనా మీరు సినిమాలో మేనేజర్ కదా..లాస్ట్ లో ఇంకేదో షాట్ చూసానే" అనేసరికి "నేనొక్కదాన్నే ప్రపంచానికి, ఆయనకు లింక్" అని చెప్పింది. వెంటనే సుమ అందుకుని "నాలాగే మీరు కూడా ..నేను కూడా అంతే ప్రోగ్రాంకి, ఆడియన్స్ కి లింక్" అని చెప్పింది. ఇక ప్రోమో చివరిలో పంఖూరి అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి అదరగొట్టింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.