English | Telugu

అమ్మమ్మ కాబోతున్న సుమ..ఇద్దరు పిల్లలంటూ షాకిచ్చిన ఈషా!

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి "మాయ బజార్" మూవీ టీమ్ మోడల్ జెస్సి, ఈషా రెబ్బ, రవి వర్మ, గౌతమీ వచ్చారు. ఈ షోకి గౌతమీ చెప్పులు వేసుకోకుండా స్టేజి మీదకు వచ్చేసరికి "మీరెందుకు చెప్పులు వేసుకోలేదు" అని సుమ అడిగింది.."దేహమే దేవాలయం" కదా అందుకే వేసుకోలేదు అని చెప్పారు. చెప్పులు సరే మీ బంగారం లాంటివి ఏవీ పెట్టుకోరా అని మళ్ళీ అడిగేసరికి "నా మనసు బంగారం" అని మరో ఆన్సర్ చెప్పారు. "ఓహో దేహం దేవాలయం, మనసు బంగారం, మరి మెదడేమిటో అనేసరికి ఖాళీ స్థలం" అని తడుముకోకుండా టక్కున చెప్పేసారు. తర్వాత రవి వర్మకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసి కొంతమంది స్టూడెంట్స్ పిలిచింది సుమ..కానీ వాళ్ళెవరూ నచ్చకపోయేసరికి పామ్పించేసింది... ఈ కాన్సెప్ట్ ఐపోయాక "అందెల రవళిది" అనే సాంగ్ కి గౌతమీ చేసిన క్లాసికల్ డాన్స్ కి అందరూ క్లాప్స్ కొట్టేశారు.

ఫైనల్ గా సుమ ఒక ఆవును తీసుకొచ్చి డాక్టర్ కి చూపించి "గడ్డి పెట్టిన తినడం లేదు, ఒంట్లో బాగుండడం లేదు"చూడండి అని చెప్పేసరికి "మీరు అమ్మమ్మ కాబోతున్నారు" అని డాక్టర్ చెప్పడంతో సుమ షాకైపోయింది..అంత షాక్లో కూడా "ఏమే చెప్పలేదేమిటే నీకు పుల్లగా ఏమన్నా తినాలనుందా" అని అడిగింది "వద్దు" అంటూ తల అడ్డంగా ఊపింది ఆ ఆవు..."తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడనిపిస్తుంది" అని ఈషాని అడిగేసరికి "తొందరపడ్డప్పుడు" అని చెప్పింది. దాంతో "ఈషా నీ ప్రేమ గురించి చెప్పు" అని సుమ రివర్స్ లో అడిగింది "యాక్ట్యువల్ గా నాకు ఇద్దరు పిల్లలున్నారు" అని చెప్పి షాకిచ్చింది.."వాళ్ళ నాన్న ఎక్కడుంటారు" అని సుమ అడగడంతో ప్రోమో ఎండ్ అయ్యింది. ఇంతకు ఈషాకు పెళ్లయిందని పిల్లలు ఉన్నారని ఎవరికీ తెలీదు మరి రేపు రాబోయే షోలో ఎం చెప్పిందో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.