English | Telugu

పెళ్లిపై క్లారిటీకి వ‌చ్చిన సుధీర్‌!

మ్యాజిక్ షోలు చేసుకుంటూ కెరీర్ ఆరంభించిన సుధీర్ కి కొన్ని ఛానెల్స్ లో పని చేసే ఛాన్స్ వచ్చింది. అలా తెలుగు ప్రేక్షకుల గుర్తింపు అందుకున్నాడు. ఆ సమయంలోనే వేణు వండర్స్ టీమ్ ద్వారా 'జబర్దస్త్' షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా వచ్చిన చాలా తక్కువ సమయంలోనే టీమ్ లీడర్ గా ఎదిగి దూసుకుపోతున్నాడు. కమెడియన్ గానే కాకుండా.. సింగర్ గా, డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. దీంతో అతడి ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది.

యాంకర్ రష్మీతో సుధీర్ ప్రేమాయణం సాగిస్తున్నాడనే వార్తల వలన అతడు మరింత పాపులర్ అయ్యాడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు చేసిన సుధీర్ కి హీరోగా మాత్రం సక్సెస్ రాలేదు. ఆ మధ్య 'సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే సినిమాలో నటించాడు. ఆ తరువాత 'త్రీ మంకీస్' చేశాడు. ఈ రెండూ వర్కవుట్ కాలేదు. హీరోగా సక్సెస్ కాలేకపోయినా.. తన ప్రయత్నాలు మాత్రం మానుకోలేదు. 'కాలింగ్ సహస్ర' అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. అరున్ విక్కిరాలా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.

అయితే ఈ సినిమా కోసం సుధీర్ ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడట. ఇందులో భాగంగానే అతడు సిక్స్ ప్యాక్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అతడు కొత్త లుక్ తో సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన అత‌ను మరో రెండేళ్ల వరకు బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేయాలని డిసైడ్ చేసుకున్నట్లు వెల్లడించాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.