English | Telugu

పెళ్లిని కామెడీగా మార్చేసిన 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ'!

రీసెంట్ గా యాంకర్ వర్ష చేతిలో తాళిబొట్టు పెట్టుకొని జూలై 4న బిగ్ అనౌన్స్‌మెంట్‌ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందని కొట్టిపారేశారు. మరికొందరు వర్ష పెళ్లి చేసుకోబోతుందంటూ పోస్ట్ లు పెట్టారు. అయితే చాలామంది అనుకున్నట్లుగా ఇదొక చీప్ పబ్లిసిటీ ట్రిక్ అని తేలిపోయింది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను విడుదల చేశారు.

ఇందులో యాంకర్ వర్ష.. కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ను పెళ్లాడుతూ కనిపించింది. వర్ష-ఇమ్మాన్యుయేల్ పెళ్లిపీటలపై ఒకరి పక్కన మరొకరు కూర్చొని తెగ సిగ్గుపడుతూ కనిపించారు. ఇంత‌కు ముందు సుధీర్-ర‌ష్మిలకు పెళ్లి చేసిన 'అహ నా పెళ్లంట‌', ఉగాది స్పెష‌ల్ ఈవెంట్‌ మంచి రేటింగ్స్ తెచ్చుకుంది.. అది మ‌ల్లెమాల వారిదే. అదే త‌ర‌హాలో ఇప్పుడు వర్ష-ఇమ్మాన్యుయేల్ లకు కూడా పెళ్లి చేసేసారు.

ఇలా అందరికీ పెళ్లిళ్లు చేస్తూ మ‌ల్లెమాల సంస్థ‌ పెళ్లిళ్ల కళ్యాణ మండపంలా మారిందంటూ కామెంట్స్ చేస్తూ నెటిజన్లు. ఇంత దిగజారుడు ప్రమోషన్స్ అవసరమా..? అంటూ నిర్వాహ‌కులను తిట్టిపోస్తున్నారు. పెళ్లి అనే ప‌విత్ర బంధాన్ని కామెడీతో హేళన చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కొత్తగా ఆలోచించి ప్రోగ్రామ్స్ చేయమని సలహాలు ఇస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.