English | Telugu

బిగ్ బాస్ లో స్నో మ్యాన్.. డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళేది ఎవరు?

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కెప్టెన్సీ టాస్క్ గత వారమే ముగియడంతో, చివరి కెప్టెన్సీ పోటీ కూడా అయిపోయింది. ఈ వారం 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలైంది.

ఈ టాస్క్ లో గెలిచే కంటెస్టెంట్ ని, తర్వాత రెండు వారాల్లో ఎవరు నామినేట్ చేసే అవకాశం ఉండదు. వాళ్ళు డైరెక్ట్ ఫైనల్ వీక్ కి వెళ్తారు. ఈ టాస్క్ లో అందరూ కూడా నువ్వా నేనా అన్నట్టుగా తలబడాలి. కానీ ఎవరు కూడా టాస్క్ లో‌‌ సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వలేదు. అయితే ఈ టాస్క్ లో మొదటి రౌండ్ లో ఎవరు అయితే‌ తొలగించబడ్డారో.. వారికి మళ్ళీ టాస్క్ పెట్టి, అందులో గెలిచిన వారికి 'టికెట్ టు ఫినాలే' టాస్క్ లోకి తిరిగి ఎంట్రీ లభిస్తుంది అని బిగ్ బాస్ చెప్పాడు.

"హౌస్ లో ఫైనల్ లెవల్ కి చేరడానికి ఈ టాస్క్ లో గెలిచిన వారికి అర్హత లభిస్తుంది. సమయానుసారం స్నో ఫాల్ జరుగుతుంది. అందులో‌నుండి 'స్నో మ్యాన్' పార్ట్స్ వెయ్యడం జరుగుతుంది. కంటెస్టెంట్స్ అందరూ వాటికోసం తలపడి వాటిని‌ సంపాదించుకోవాలి. ఆ పార్ట్స్ తో 'స్నో మ్యాన్' ని రెడీ చేయాలి. ఇదంతా మొదటి బజర్ మోగిన నుండి ఎండ్ బజర్ మోగే వరకు సమయంలో మాత్రమే జరగాలి. తక్కువ పార్ట్స్ ఉన్న 'స్నో మ్యాన్' చేసిన కంటెస్టెంట్ ఈ రౌండ్ నుండి తొలగించబడతారు" అని కంటెస్టెంట్స్ తో చెప్పాడు బిగ్ బాస్.

టాస్క్ లోని మొదటి లెవెల్ పూర్తి అయ్యేసరికి శ్రీసత్య వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు టాస్క్ లో ఉన్నారు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.