English | Telugu

రాజ్ నిజస్వరూపాన్ని తెలుసుకున్న సీతారామయ్య ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -224 లో.. కావ్య ఇంట్లో నుండి పోవడం ఎవరికీ తెలియదు. అసలు ఎందుకు వెళ్లిందో తెలియదు. మేం కావ్యని వెతికే పనిలోనే ఉన్నాం. మాకు సపోర్ట్ చెయ్యండని కనకానికి ఇందిరాదేవి చెప్తుంది. ఇంతమందిని బాధపెట్టి అసలు ఈ కావ్య ఎక్కడికి వెళ్లినట్టు అని రాజ్ కోపంగా ఉంటాడు.

మరొక వైపు గుడిలో కూర్చొని ఉన్న కావ్య దగ్గరకి పూజారి వస్తాడు. పూజారి పిలిచినా కావ్య పట్టించుకోకుండా ఆలోచనలో పడుతుంది. కావ్యని చూసిన పూజారి.. దుగ్గిరాల ఇంటి కోడలని అనుకొని వెంటనే సీతారామయ్యకి ఫోన్ చేసి మీ మనవరాలు గుడిలో ఉందని చెప్తాడు. ఆ తర్వాత సీతారామయ్య, ఇందిరాదేవి ఇద్దరు వెళ్తారు. అసలు ఇంటినుండి ఎందుకు వెళ్లిపోయిందో కారణం తెలుసుకొని ఇంటికి తీసుకొని వద్దామనుకుంటారు. ఆ తర్వాత దగ్గరికి వెళ్లి అసలు ఏమైంది? ఎందుకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చావని ఇందిరాదేవి అంటుంది.

కాసేపటికి రాజ్ రాసిన చీటీ సీతరామయ్యకు ఇస్తుంది కావ్య. అది చదివి సీతారామయ్యా షాక్ అవుతాడు. ఇందిరాదేవి కూడా చదువుతుంది.. కావ్య ఏడుస్తూ తన బాధ వాళ్ళిద్దరికీ చెప్తుంది. ఇంటికి వెళదామని వాళ్ళు అనగానే.. ఏం చూసుకొని రావాలి ఐశ్వర్యం చూసా? అత్త ఆదరణ లేదు, భర్త ప్రేమ లేదు. ఏ దారి లేదు. అందుకే ఇక్కడ కూర్చొని ఉన్నానని కావ్య ఎమోషనల్ అవుతుంది. ఇంటికి వెళదాం పదా, నీకేం బాధ రాకుండా చూసుకుంటామని ఇందిరాదేవి అంటుంది. నేను ఎప్పటికి ఆ ఇంటి అతిధినే, ఇంకా ఆ ఇంట్లో సభ్యురాలిని కాలేకపోతున్నాను. ఇంకా ఎందుకు రావాలని కావ్య ఎమోషనల్ గా అంటుంది.

రాజ్ ఇన్ని రోజులు నీపై చూపించే ప్రేమ అంతా నాటకమని, నీకు ముందు తెలిసింది. నాకు లేట్ గా తెలిసింది.. నీ భర్తని నువ్వే మార్చుకోవాలి. నా మనవడు మారలేని మూర్కుడు కాదు. సహానం కావాలని ఇందిరాదేవీ అంటుంది. నీ భర్త ప్రేమ నీకు దక్కాలని సంకల్పం ఉండాలి. రాజ్ లో మార్పు కోసం నీకు అండగా ఉంటామని కావ్యకి నచ్చజెప్పి ఇంటికి తీసుకొని వెళ్తుంటారు. అప్పుడే రాజ్ కోపంగా వచ్చి.‌. ఎందుకు చెప్పకుండా వచ్చావంటూ కోప్పడతాడు. ఏదో మొక్కు ఉందట, అందుకే వచ్చిందట నీ భార్యని నువ్వు తీసుకొని వెళ్ళమని సీతారామయ్య చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.