Read more!

English | Telugu

రాజ్ నిజస్వరూపాన్ని తెలుసుకున్న సీతారామయ్య ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -224 లో.. కావ్య ఇంట్లో నుండి పోవడం ఎవరికీ తెలియదు. అసలు ఎందుకు వెళ్లిందో తెలియదు. మేం కావ్యని వెతికే పనిలోనే  ఉన్నాం. మాకు సపోర్ట్ చెయ్యండని కనకానికి ఇందిరాదేవి చెప్తుంది. ఇంతమందిని బాధపెట్టి అసలు   ఈ కావ్య ఎక్కడికి వెళ్లినట్టు అని రాజ్ కోపంగా ఉంటాడు. 

మరొక వైపు గుడిలో కూర్చొని ఉన్న కావ్య దగ్గరకి పూజారి వస్తాడు. పూజారి పిలిచినా కావ్య పట్టించుకోకుండా ఆలోచనలో పడుతుంది. కావ్యని చూసిన పూజారి.. దుగ్గిరాల ఇంటి కోడలని అనుకొని వెంటనే సీతారామయ్యకి ఫోన్ చేసి మీ మనవరాలు గుడిలో ఉందని చెప్తాడు. ఆ తర్వాత సీతారామయ్య, ఇందిరాదేవి ఇద్దరు వెళ్తారు. అసలు ఇంటినుండి ఎందుకు వెళ్లిపోయిందో కారణం తెలుసుకొని ఇంటికి తీసుకొని వద్దామనుకుంటారు. ఆ తర్వాత దగ్గరికి వెళ్లి అసలు ఏమైంది? ఎందుకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చావని ఇందిరాదేవి అంటుంది.

కాసేపటికి రాజ్ రాసిన చీటీ సీతరామయ్యకు ఇస్తుంది కావ్య. అది చదివి సీతారామయ్యా షాక్ అవుతాడు. ఇందిరాదేవి కూడా చదువుతుంది.. కావ్య ఏడుస్తూ తన బాధ వాళ్ళిద్దరికీ చెప్తుంది. ఇంటికి వెళదామని వాళ్ళు అనగానే.. ఏం చూసుకొని రావాలి ఐశ్వర్యం చూసా? అత్త ఆదరణ లేదు, భర్త ప్రేమ లేదు. ఏ దారి లేదు. అందుకే ఇక్కడ కూర్చొని ఉన్నానని కావ్య ఎమోషనల్ అవుతుంది. ఇంటికి వెళదాం పదా, నీకేం బాధ రాకుండా చూసుకుంటామని ఇందిరాదేవి అంటుంది. నేను ఎప్పటికి ఆ ఇంటి అతిధినే, ఇంకా ఆ ఇంట్లో సభ్యురాలిని కాలేకపోతున్నాను. ఇంకా ఎందుకు రావాలని కావ్య ఎమోషనల్ గా అంటుంది.

రాజ్ ఇన్ని రోజులు నీపై చూపించే ప్రేమ అంతా నాటకమని, నీకు ముందు తెలిసింది. నాకు లేట్ గా తెలిసింది.. నీ భర్తని నువ్వే మార్చుకోవాలి. నా మనవడు మారలేని మూర్కుడు కాదు. సహానం కావాలని ఇందిరాదేవీ అంటుంది. నీ భర్త ప్రేమ నీకు దక్కాలని సంకల్పం ఉండాలి. రాజ్ లో మార్పు కోసం నీకు అండగా ఉంటామని కావ్యకి నచ్చజెప్పి ఇంటికి తీసుకొని వెళ్తుంటారు. అప్పుడే రాజ్ కోపంగా వచ్చి.‌. ఎందుకు చెప్పకుండా వచ్చావంటూ కోప్పడతాడు. ఏదో మొక్కు ఉందట, అందుకే వచ్చిందట  నీ భార్యని నువ్వు తీసుకొని వెళ్ళమని సీతారామయ్య చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.