Read more!

English | Telugu

బిగ్ బాస్‌లో శివాజీ పుంజు పందెం కొట్టింది!

బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ గా మొదలైన విషయం తెలిసిందే. రోజుకో మలుపు తిరుగుతూ సరికొత్తగా మారుతుంది. ఉల్టా పల్టా థీమ్ తో అదరహో అనిపిస్తుంది. ప్రతీ వీకెంట్ అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తుంది.

బిగ్ బాస్ హౌజ్ లో‌ మంగళవారం మొదలైన టాస్క్ లు కొనసాగుతున్నాయి. మొదటి రోజు కొత్త కంటెస్టెంట్స్ (పోటుగాళ్ళు) ఆధిక్యంలో ఉండగా, రెండవ రోజు ఆటగాళ్ళు టాస్క్ గెలిచారు.  కంటెస్టెంట్స్ కి మూడవ టాస్క్ గా " ఫాస్టెస్ట్ ఎవరు" అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో రెండు టీమ్ ల నుండి ఒక్కొక్కరు రావాలి. "కలర్ కలర్ విచ్ కలర్ డు యూ వాంట్" అని కంటెస్టెంట్స్ అడిగితే బిగ్ బాస్ ఒక కలర్ చెప్తాడు.  అ కలర్ గల వస్తువులని హౌజ్ లో నుండి తీసుకొచ్చి రౌండ్ లోపల వేయాలని బిగ్ బాస్ చెప్పగా.. ‌ఆట సందీప్- అంబటి అర్జున్ తలపడగా.. అంబటి అర్జున్ మొదటి రౌండ్ లో గెలిచాడు. ఆ తర్వాత అశ్విని శ్రీ- అమర్ దీప్ ఇద్దరు తలపడగా తన దగ్గర అమర్ దీప్ లాక్కొని మ వచ్చి వేశాడు. ఆ తర్వాత టేస్టీ తేజ లేట్ గా రావడంతో.‌ వెల్ ట్రై తేజ అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత అంబటి అర్జున్-ఆట సందీప్ ఇద్దరు తలపడగా అందులో లెమన్ కలర్ తీసుకురమ్మని బిగ్ బాస్ చెప్పగా.. పసుపు కలర్ కుర్చీ అంబటి అర్జున్ తీసుకొచ్చాడు. ఆకుపచ్చ కలర్ కుర్చీ ఆట సందీప్ తెచ్చాడు. దీంతో ఈ రౌండ్ ని క్యాన్సిల్ చేశాడు బిగ్ బాస్.

ఆ తర్వాత ప్రియాంక జైన్ - నయని పావని తలపడగా.. సిల్వర్ కలర్ అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ప్రియాంక తెలివిగా ఆలోచించి అక్కడే డంబెల్స్ ఉండే ఇనుల రాడ్ తీసుకొచ్చి ఫాస్ట్ గా ఆ రౌండ్ లో వేసింది. అలా ఇరు జట్లు తలపడగా చివరగా 'ఆటగాళ్లు' టీమ్ గెలించిందని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్, ఆట సందీప్ అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక హౌజ్ లోకి శివాజీ వస్తూ.. " మా పుంజు పందెం కొట్టింది " అంటు తన సంతోషాన్ని వ్యక్తీకరించాడు. ఇలా హౌజ్ లో శివాజీ పెద్దన్నలాగా తోటి హౌజ్ మేట్స్ కి దగ్గరుండి జోష్ ని నింపుతూ.. ఆటతీరుతో, మాటతీరుతో అదుర్స్ అనిపించుకున్నాడు.