English | Telugu

యావర్ కి గిఫ్ట్ తెచ్చిన శోభాశెట్టి అమ్మ!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పుడు మరింత క్రేజ్ ని తెచ్చుకుంటుంది. దానికి కారణం ఫ్యామిలీ వీక్. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఆటతీరుతో, మాటతీరుతో ఆకట్టుకుంటుండగా.. బిగ్ బాస్ రోజుకో ట్విస్ట్ ఇస్తూ మరింత హైప్ తీసుకొస్తున్నాడు.

ఫ్యామీలీ వీక్ లో భాగంగా ఈ రోజు మొదటి ప్రోమోలో అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ వచ్చినట్టు బిగ్ బాస్ చూపించారు. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన రెండవ ప్రోమోలో శోభాశెట్టి వాళ్ళ అమ్మ హౌస్ లోకి వచ్చింది. " అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి " సినిమాలోని అమ్మ పాటని బిజిఎమ్ గా వేసి మరింత ఆసక్తిగా మలిచారు బిగ్ బాస్ మేకర్స్. తల్లిని చూసిన శోభాశెట్టి తల్లడిల్లిపోయింది. కొన్ని రోజులుగా ఫ్యామిలీని బాగా మిస్సింగ్ అంటు శోభాశెట్టి అంటుంది.

ఇప్పుడు కన్నతల్లిని చూడగానే శోభాకి కంటనీరు ఆగలేకపోయాయి. అయితే యావర్ కోసం శోభాశెట్టి వాళ్ళ అమ్మ ఒక బహుమతి తీసుకొచ్చింది. యావర్ తల్లి చనిపోయింది. అందుకే నిన్న గౌతమ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు యావర్ బాగా ఏడ్చేసాడు. ఇప్పుడు కూడా ఎమోషనల్ అయిన యావర్ కి.. కొంగులో దాచిన యావర్ తల్లి ఫోటోని ఇచ్చింది శోభాశెట్టి అమ్మ. ఆ ఫోటోని చూడగానే యావర్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు.

శివాజీ చూసి అమ్మ వచ్చింది యావర్ అనగానే.. మరింత ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత శోభాశెట్టి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడ్డాడు యావర్. నేను కూడా మీ అమ్మనే అంటూ శోభాశెట్టి వాళ్ళ అమ్మ అంది. కాసేపటికి హౌస్ మేట్స్ అంతా యావర్ ని ఓదార్చారు. ఇప్పుడు యావర్ కోసం బిగ్ బాస్ పంపించిన గిఫ్ట్ తో ఈ ఎపిసోడ్ మరింత ఎమోషనల్ గా మారనుంది. అయితే శోభాశెట్టి వాళ్ళ అమ్మ శోభాకి కొన్ని సలహాలిచ్చినట్టు తెలుస్తుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.