English | Telugu
ఫంక్షన్స్ లో దొంగతనంగా వెళ్లి తినేవాళ్ళం...
Updated : May 30, 2025
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో రాబోయే వారం షో ప్రోమో చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు రాకమానవు. ఈ న్యూ ఎపిసోడ్ ని ఫ్రెండ్ షిప్ థీమ్ గా రాబోతోంది. దాంతో ఈ షోలో కంటెస్టెంట్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చారు. ఇక శేఖర్ మాష్టర్ కోసం కూడా ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఎవరో కాదు సత్య మాష్టర్. ఇద్దరి మధ్య అంత ఎమోషనల్ బాండింగ్ ఎలా ఫార్మ్ అయ్యింది అని శ్రీముఖి అడిగేసరికి "ఉదయం 5 గంటలకే లేచేవాళ్ళం. రాత్రి వరకు మాకు డాన్స్ మాత్రమే ప్రపంచం అంతకు మించి మాకు ఇంకేం తెలీదు. మాకు ఆ టైములో తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు. ఐదేళ్లు అలా ఉన్నాం. దొంగచాటుగా ఫంక్షన్ హాల్స్ కి వెళ్ళేవాళ్ళం.. అక్కడే ఎక్కువగా తినేవాళ్ళం.
అక్కడ తినేటప్పుడు రేయ్ ఎవర్రా మీరు. ఎవరి తరపున అని అడిగితే నేను మాట్లాడేవాడిని కాదు నాకు భయం అందుకే వీడే సమాధానం చెప్పేవాడు. అలా ఎన్నో సార్లు మాకు సత్యసాయి కల్యాణ మండపం, సవేరా ఫంక్షన్ హాల్ ఉండేవి. అవే మమ్మల్ని చాలావరకు కాపాడాయి. చెప్తారు కదా కష్టాల్లో ఉన్న ఫ్రెండ్ ని ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరని..మేము కూడా అలాగే కష్టాల్లోనే పెరిగాం ఎం మాట్లాడాలో అర్ధం కావట్లేదు." అంటూ శేఖర్ మాష్టర్ ఎమోషనల్ అయ్యాడు. రాకేష్ మాష్టర్ దగ్గర ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్స్ గా ఉన్న శేఖర్ , జానీ, సత్య మాష్టార్లు శిష్యులుగా ఉండేవాళ్ళు. ఇక శేఖర్ మాష్టర్ విషయానికి వస్తే రీసెంట్ గా ఆయన కొన్ని ట్రోలింగ్స్ ని కూడా ఎదుర్కొన్నారు. ఐతే రీసెంట్ గా "దబిడి దబిడి" సాంగ్ విషయంలో అలాగే "మిస్టర్ బచ్చన్" మూవీలోని సాంగ్ విషయంలో, పుష్ప 2 లో పీలింగ్స్ సాంగ్స్ విషయంలో కోరియోగ్రఫీ చేసి విమర్శలు ఎదుర్కున్నాడు. ఆ స్టెప్స్ వల్గర్ గా ఉన్నాయనే కామెంట్స్ ని ఫేస్ చేసాడు.