English | Telugu

సర్కార్ సీజన్ 5 జూన్ 6 నుంచి ఆడియన్స్ ముందుకు



ఓటిటి ప్లాట్ఫారం మీద వచ్చే క్విజ్ షోస్ లో సర్కార్ షోకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఇప్పటి వరకు ఇది 4 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. ఆహా ఓటిటి ప్లాట్ఫారం మీద ఈ షో బాగా సక్సెస్ సాధించింది. ఇప్పుడు సీజన్ 5 తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ షో గ్లిమ్ప్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. మొదటి 3 సీజన్స్ కి ప్రదీప్ హోస్ట్ గా చేసాడు 4 వ సీజన్ కి ఇప్పుడు రాబోతున్న 5 వ సీజన్ కి సుధీర్ హోస్ట్ గా వున్నాడు. ఇక ఈ షో ప్రతీ శుక్రవారం కొత్త ఎపిసోడ్ రాబోతోంది. జూన్ 6 నుంచి షో ఆడియన్స్ ముందుకు వచ్చేయబోతోంది.

"ఒకటే ఆట ఆడే నాకీ...ఏదోలా గెలిసే నాకీ ఇంత పెద్ద బతుకెందుకు..ఏదైనా ఈ స్టేజి మీద ఉన్నప్పుడే సేసెయ్యాల...ఆడతామా ఏటి మళ్ళీ...సర్కార్ సీజన్ 5 ..ఇక్కడ ఆడేది గెలవనీకి కాదు...నువ్వెందో అందరికీ తెల్వనీకి.." అంటూ తన కటౌట్ తో షో థీమ్ చెప్పాడు సుధీర్. సుధీర్ ని చూసిన నెటిజన్స్ ఐతే "గేమ్ చెంజర్ ఈజ్ బ్యాక్...ఆట మొదలయ్యింది. " అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సర్కార్ గేమ్ షో అనేది 2021 లో స్టార్ట్ అయ్యింది. ఈ షోకి ఇంతవరకు అనన్య నాగళ్ళ, సుహాస్, కాజల్, సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, నందిని రెడ్డి, మాళవికా నాయర్, బ్రహ్మాజీ, అల్లరి నరేశ్, నిహారిక కొణిదెల, సదా, కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, నవదీప్ వంటి ఎంతో మంది ఈ షోకి గెస్టులుగా వచ్చి మూవీ ప్రొమోషన్స్ చేసుకున్నారు గేమ్ షో ఆడారు. ఇక ఈ సీజన్ 5 కి ఎలాంటి గెస్టులు వస్తారో చూడాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.