English | Telugu

Illu illalu pillalu : ప్రేమకి సారీ చెప్పిన ధీరజ్.. అమూల్య నిశ్చితార్థం జరుగుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -367 లో...... ధీరజ్ టీ షర్ట్ పై DP అని లవ్ సింబల్ వెయ్యడంతో అందరు తనని ఆటపట్టిస్తారు. ఆ తర్వాత ముగ్గురు కొడుకులని రామరాజు పిలుస్తాడు. నిశ్చితార్థంలో ఎలాంటి లోపాలు జరగద్దు.. ఇంట్లో అన్ని ఏర్పాట్లు కూడా చందు, శ్రీవల్లి చూసుకోండి.. ఎంగేజ్ మెంట్ రింగ్స్ మీరు తీసుకొని రండి అని ధీరజ్, ప్రేమలకి రామరాజు చెప్తాడు. దాంతో ధీరజ్ కి ఇష్టం లేకున్నా
సరే అంటాడు.

అ తర్వాత ఒరేయ్ సాగర్ మొన్న సేట్ కి డబ్బులు ఇవ్వమంటే ఒక లక్ష అపావంట ఎందుకని రామరాజు అడుగుతాడు. సాగర్ టెన్షన్ పడుతాడు. అప్పుడే వేదవతి వచ్చి వాడిని అలా అడుగుతారు ఏంటని టాపిక్ డైవర్ట్ చెస్తుంది. అమూల్యకి పెళ్లి ఇష్టం లేనట్లుందని రామరాజుతో వేదవతి అంటుంది. అదేం లేదు.. తను నా కూతురు అని రామరాజు చాలా నమ్మకంగా చెప్తాడు. అ తర్వాత సాగర్ టెన్షన్ పడుతుంటే.. ఏమైందని నర్మద అడుగుతుంది. నా ఫ్రెండ్ కి అర్జంట్ అని డబ్బు ఇచ్చానని సాగర్ అంటాడు. ఆ విషయం మరి మావయ్యకి చెప్పాలి కదా అర్జెంట్ గా వెళ్లి డబ్బులు తీసుకొని వచ్చి అతనికి ఇచ్చేయమని నర్మద అనగానే నాన్న వేరే పని చెప్పాడు కదా ఇప్పుడు ఎలా అని సాగర్ అంటాడు. సరే ఈ పని అయ్యాక వెళ్ళు అని నర్మద అంటుంది. హమ్మయ్య తప్పించుకున్నానని సాగర్ అనుకుంటాడు.

అ తర్వాత ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి.. ఏంటె.. నా టీ షర్ట్ పై ఎందుకు అలా రాసావని కోప్పడతాడు. నువ్వు మన పేర్లు పేపర్ పై రాస్తే చింపేశావ్.. కానీ మనల్ని ఎవరు వేరు చేయలేరని చెప్పడానికి అలా చేశానని ప్రేమ అంటుంది.అ తర్వాత నాన్న మనల్ని బయటకు వెళ్లి రింగ్స్ తీసుకొని రమ్మన్నారని ధీరజ్ అనగానే నాకు సారీ చెప్తేనే వస్తానని ప్రేమ అంటుంది. ధీరజ్ కి వేరే ఆప్షన్ లేక ప్రేమకి సారీ చెప్తాడు. ఇద్దరు కలిసి గోల్డ్ షాప్ కి బయల్దేరతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.