English | Telugu

మీ పిల్లలకు ఎం చదువులు చెప్తారా అని భయంగా ఉంది

సర్కార్ సీజన్ 5 ఈ వారం ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా సాగింది. ఇందులో రకరకాల ప్రశ్నలు అడిగాడు. ఈ షోకి ఆరియానా, వర్షిణి, దేత్తడి హారికా, శ్రీసత్య వచ్చారు. వచ్చే ముందు సుధీర్ ని ఆటపట్టించారు. ఇక ఒక ప్రశ్న అడిగారు సుధీర్ ఇందులో. "లక్ష రూపాయల్లో ఎన్ని 500 నోట్లు ఉంటాయి " అని అడిగాడు. ఈ ప్రశ్నకు క్లూస్ కోసం అందరూ డబ్బులు బిడ్డింగ్ పెంచుతూ వెళ్తున్నారు. ఆరియానా ఆశాలు బిడ్ చేయకపోయేసరికి సుధీర్ అడిగాడు ఎందుకు బిడ్ చేయట్లేదని. దానికి ఆరియానా ఏంటి నువ్వు ? అని అడిగాడు. "మీరు లెక్కలు అడిగారు నేను లెక్కల్లో చాలా పూర్. నా పరువు పోతుందని భయం" అంది. "ఎప్పుడన్నా మనకు ఉన్నదాని గురించి పోయిద్దా అని ఆలోచించాలి" అని కౌంటర్ వేసాడు.

"ఎందుకంటే ఇంత కఠినంగా ఉంటారు మీరు" అని మళ్ళీ సుధీర్ అడిగేసరికి "ఇంత కఠినంగా ఉండే మీరు మమ్మల్ని కఠినంగా" అంటూ ఆ కఠినం అనే పదాన్ని పలకలేకపోయింది. దాంతో సుధీర్ "నీకు ఇంగ్లీష్ కాదు తెలుగు కూడా రాదు" అనేశాడు. "ఎలా లెక్కపెట్టాలి" అంటూ హారిక ఫైనల్ గా 200 అంటూ ఆన్సర్ చెప్పింది. దాంతో సుధీర్ షాకై చూస్తూ "మీ తెలివితేటలకు ఒక దణ్ణం..నా ప్రాబ్లమ్ మిమ్మల్ని ఎవరు చేసుకుంటారన్నది కాదు. మీ పిల్లలకు చదువులు ఎం చెప్తారా అన్నదే భయంగా ఉంది" అన్నాడు సుధీర్. దానికి వర్షిణి "మేమే చదవలేదు..మా పిల్లలకేం చదువు చెప్తాము ఇంకా" అంది. "అదే నా భయం పొరపాటున ఇంట్లో ఏదన్నా డౌట్ ఉంటే అని. అమ్మా లక్షలో ఎన్ని 500 లు ఉంటాయి అని పిల్లలు అడిగితే ఆ 100 అన్నారనుకో మొత్తం పోయినట్టే కదా " అంటూ కౌంటర్ వేసాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.