English | Telugu

IVF ద్వారా నైనా పిల్లల్ని కనాలి అంటున్న సదా!

సెలబ్రిటీలు ఏది చేసిన, ఏం చెప్పినా ట్రెండే అవుతుంది. తాజాగా మ్యారేజ్ సిస్టమ్ గురించి హీరోయిన్ సదా సెన్సేషనల్ కామెంట్లు చేసింది. పెద్దలు కుదుర్చిన పెళ్ళంటేనే భయమేస్తుందంట సదాకి. కారణం పెళ్ళయ్యాక ఆ భర్త అనే అతను ఏం చెప్పినా చేయాలి? మనకంటూ సొంతంగా నిర్ణయం తీసుకునే రైట్ ఉండదు. మనకి ఆలోచన స్వేచ్ఛనివ్వరు.‌ ఏదీ మనకి నచ్చినట్డు ఉండదంటూ తన ఫేస్ బుక్ లో షేర్ చేసింది.

మ్యారేజ్ సిస్టం గురించి సదా మాట్లాడుతూ.. పెళ్ళయ్యాక మనకి ఇష్టం ఉన్నా లేకున్నా పిల్లల్ని కనాలి. మనకి పిల్లలు పుట్టకుంటే IVF ద్వారా అయినా కనాలి. కానీ వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. అసలు బయట నేచర్ మనకి సపోర్ట్ గా లేదు. నేను పెళ్ళి చేసుకోను. ఎందుకంటే ఇప్పటికే ఉన్న మనుషులకి సరిపడే వనరులు లేవు. అదేకాక బయట మనం తీసుకునే ఫుడ్ లో కూడా అంత నాణ్యత లేదు. పిల్లల్ని కని వాళ్ళని పోషించడం కూడా కష్టమే. అందుకే ఈ పెద్దలు కుదిర్చిన పెళ్ళంటే నాకు భయం. 'మేల్ స్టిగ్మ ఈజ్ ది రీజన్ ఫర్ కాంప్లికేటెడ్ మ్యారేజెస్' అని వీడియోని షేర్ చేసింది సదా.

సదా అని పిలవబడే సదాఫ్ మొహమ్మద్ సయీద్.. తెలుగు సీనీ పరిశ్రమలో 'జయం' మూవీతో అరంగేట్రం చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అల్లరి నరేష్ తో కలిసి 'ప్రాణం' సినిమాలో నటించింది. జయం, నాగ, లీలా మహల్ సెంటర్, దొంగ-దొంగది, ఔనన్న కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, వీరభద్ర, క్లాస్ మేట్స్, శంకర్ దాదా జిందాబాద్, టక్కరి, అపరిచితుడు, యమలీల 2 మొదలగు సినిమాలలో నటించిన సదా కెరీర్ లో 'జయం' మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

సదా ముంబై లో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసి అక్కడే తన జ్ఞాపకాలు ఉన్నాయంటూ ఈ మధ్యకాలంలో ఎమోషనల్ అవుతూ ఒక వ్లాగ్ ని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. సినిమాలలో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న సదా.. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. పలు టీవీ షోస్ లో జడ్జ్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది. 'ఢీ' డాన్స్ షోకి శేఖర్ మాస్టర్ తో కలిసి జడ్జ్ గా వ్యవహరించగా వీళ్ళిద్దరి జడ్జిమెంట్ అంటే ఎంటర్‌టైన్మెంట్ కి కేరాఫ్ గా ఉంటుంది. బిబి జోడికి జడ్జిగా చేసి ఆ షోకి మరింత క్రేజ్ వచ్చేలా చేసింది సదా. అయితే సదాకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. అంతే కాకుండా సదా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి తన అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తోంది. ఫోటోషూట్స్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తుంది. కాగా ఫేస్ బుక్ లో తాజాగా మ్యారేజ్ పై చేసిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.