English | Telugu

దుగ్గిరాల ఇంట్లో కనకం ఉండగలదా.. వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఇష్టం కొంచెం కష్డం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -228 లో.. దుగ్గిరాల వారింటికి కనకం, కృష్ణమూర్తి ఇద్దరు వస్తారు. వాళ్ళని చుసిన కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళెందుకు వచ్చారన్నట్లుగా స్వప్న చూస్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చారని రుద్రాణి అడుగుతుంది. కాసేపటికి రుద్రాణి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంది. దాంతో రుద్రాణిపై ఇందిరాదేవి కోప్పడుతుంది.

ఆ తర్వాత రాజ్ వాళ్ళని కూర్చోమని చెప్పి.. మీ కంటే నా భార్య నయం పుట్టింటి వాళ్లపై ఈగ కూడా వాలానియ్యదు.. స్వప్న చూడు మంచిగా రసం తాగుతుంది. ఇప్పటివరకు చూసాను, నీ భార్యకు చెప్తావని అయిన చవటలాగా చూస్తున్నావని రాహుల్ ని తిడతాడు రాజ్. ఆ తర్వాత స్వప్న వెళ్లి కనకాన్ని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కనకం కృష్ణమూర్తి లు అసలు వచ్చిన విషయం చెప్తారు. స్వప్నని వాళ్ళింటికి తీసుకొని వెళ్ళాలని కనకం అడుగుతుంది. త్వరగా తీసుకొని వెళ్ళండి అన్నట్లు రుద్రాణి మాట్లాడుతుంది.

నీకు ఏమైనా బుద్ది ఉందా అసలు నీ కోడలికి శ్రీమంతం చెయ్యాలి కదా అని రుద్రాణిని ఇందిరాదేవి అంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఇక్కడే ఉండి స్వప్నని చూసుకో అని ఇందిరాదేవి చెప్తుంది. ఆ మాటకి స్వప్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత మీరు చెప్పేది కూడా మా కూతురు మంచి కోసమే కదా అని కనకం సరే అంటుంది. మీరు నిర్ణయం తీసుకున్నాక నన్ను అడగడం దేనికి అంటూ అపర్ణ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత కనకానికి ఇంట్లో ఉండడం వద్దని కావ్య చెప్తుంది. దాంతో ఇందిరాదేవి కోపంగా.. మేం నిర్ణయం తీసుకున్నాం అంతే అని అనగా.. కనకం తప్పక దుగ్గిరాల ఇంట్లో ఉంటుంది. మరొకవైపు కళ్యాణ్ ఇచ్చిన చీర కట్టుకొని చూసుకుంటుంది అప్పు. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. చీర తీసి పక్కన పడేస్తుంది. కళ్యాణ్ కింద పడి ఉన్న చీరనీ చూసి.. నీకు ఇష్టం లేదు కదా అయినా ఉంచుకో అని చెప్తాడు. ఎంగేజ్ మెంట్ కాకుండా డైరెక్ట్ పెళ్లి అనుకుంటున్నారని కళ్యాణ్ చెప్పి వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత అప్పు బాధపడుతుంది. మరొక వైపు అపర్ణ భోజనానికి రానని అనడంతో సుభాష్ నచ్చజెప్పి తీసుకొని వెళ్తాడు.. అందరు భోజనం చేస్తుండగా కనకాన్ని రుద్రాణి అవమానిస్తుటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.