English | Telugu
దుగ్గిరాల ఇంట్లో కనకం ఉండగలదా.. వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఇష్టం కొంచెం కష్డం!
Updated : Oct 16, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -228 లో.. దుగ్గిరాల వారింటికి కనకం, కృష్ణమూర్తి ఇద్దరు వస్తారు. వాళ్ళని చుసిన కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళెందుకు వచ్చారన్నట్లుగా స్వప్న చూస్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చారని రుద్రాణి అడుగుతుంది. కాసేపటికి రుద్రాణి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంది. దాంతో రుద్రాణిపై ఇందిరాదేవి కోప్పడుతుంది.
ఆ తర్వాత రాజ్ వాళ్ళని కూర్చోమని చెప్పి.. మీ కంటే నా భార్య నయం పుట్టింటి వాళ్లపై ఈగ కూడా వాలానియ్యదు.. స్వప్న చూడు మంచిగా రసం తాగుతుంది. ఇప్పటివరకు చూసాను, నీ భార్యకు చెప్తావని అయిన చవటలాగా చూస్తున్నావని రాహుల్ ని తిడతాడు రాజ్. ఆ తర్వాత స్వప్న వెళ్లి కనకాన్ని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కనకం కృష్ణమూర్తి లు అసలు వచ్చిన విషయం చెప్తారు. స్వప్నని వాళ్ళింటికి తీసుకొని వెళ్ళాలని కనకం అడుగుతుంది. త్వరగా తీసుకొని వెళ్ళండి అన్నట్లు రుద్రాణి మాట్లాడుతుంది.
నీకు ఏమైనా బుద్ది ఉందా అసలు నీ కోడలికి శ్రీమంతం చెయ్యాలి కదా అని రుద్రాణిని ఇందిరాదేవి అంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఇక్కడే ఉండి స్వప్నని చూసుకో అని ఇందిరాదేవి చెప్తుంది. ఆ మాటకి స్వప్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత మీరు చెప్పేది కూడా మా కూతురు మంచి కోసమే కదా అని కనకం సరే అంటుంది. మీరు నిర్ణయం తీసుకున్నాక నన్ను అడగడం దేనికి అంటూ అపర్ణ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత కనకానికి ఇంట్లో ఉండడం వద్దని కావ్య చెప్తుంది. దాంతో ఇందిరాదేవి కోపంగా.. మేం నిర్ణయం తీసుకున్నాం అంతే అని అనగా.. కనకం తప్పక దుగ్గిరాల ఇంట్లో ఉంటుంది. మరొకవైపు కళ్యాణ్ ఇచ్చిన చీర కట్టుకొని చూసుకుంటుంది అప్పు. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. చీర తీసి పక్కన పడేస్తుంది. కళ్యాణ్ కింద పడి ఉన్న చీరనీ చూసి.. నీకు ఇష్టం లేదు కదా అయినా ఉంచుకో అని చెప్తాడు. ఎంగేజ్ మెంట్ కాకుండా డైరెక్ట్ పెళ్లి అనుకుంటున్నారని కళ్యాణ్ చెప్పి వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత అప్పు బాధపడుతుంది. మరొక వైపు అపర్ణ భోజనానికి రానని అనడంతో సుభాష్ నచ్చజెప్పి తీసుకొని వెళ్తాడు.. అందరు భోజనం చేస్తుండగా కనకాన్ని రుద్రాణి అవమానిస్తుటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.