English | Telugu

తనని మొదటిసారి అమ్మ అని పిలిచిన రిషి.. ఎమోషనల్ అయిన జగతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ 774 లో.. రిషి వెళ్ళిపోతుంటే వసుధార, జగతి ఇద్దరు వెళ్ళొద్దని బ్రతిమిలాడుతూ తన వెనకాలే వెళ్తారు‌. తన ఏడుస్తూ కొడుకుని కాపాడుకోవాలనే ఇలా చేశానని జగతి అంటుంది. కొడుకును కాపాడుకోవడానికి మోసగాడు అని ముద్ర వెయ్యాలా అని రిషి ఆవేశంగా మాట్లాడుతాడు. చిన్నప్పుడు నువ్వు నన్ను వదిలివెళ్తుంటే ఆ బాధ నాకు తెలియలేదు.. మళ్ళీ నా జీవితంలోకి వచ్చారని రిషి అంటాడు. వసుధారని ప్రేమిస్తున్నట్లు మీరే చెప్పారు.. ఆ తర్వాత ఇలా మోసగాడిని చేశారు. ఇది నయవంచనే కదా. ఇంత బాధని నేను మోయలేకపోతున్నానని రిషి అంటాడు.

రిషి నిన్ను కాపాడుకోవడానికి ఇలా చేశాను.. వసుధార తప్పేం లేదని జగతి అంటుంది. మీ తప్పేం లేదు, తప్పంత నాదే, మనసంటూ ఒకటి ఉంటుందని నమ్మాను.. ఏం పాపం చేశాను.. మీ కడుపున పుట్టడమే నేను చేసిన నేరమా.. అన్న తమ్ముళ్ళ మధ్య గొడవలు ఉంటాయి.. భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటాయి. కొడుకుకి ఏ తల్లి ద్రోహం చెయ్యాలనుకుంటుంది.. బాగా నమ్మినవారు మోసం ఎలా చేస్తారో చూపెట్టారు.. నన్ను బతికి ఉండగానే చంపేశారు.. నేను మోసగాడని అందరికి తెలిసేలా చేశారని రిషి అంటాడు. నిన్ను మోసం చెయ్యలేదు.. నన్ను నమ్ము అని జగతి ఏడుస్తుంది. మీరు చేసింది న్యాయమే.. ఇప్పుడు సాయం చెయ్యండి. నన్ను కలవకండి.. నాతో మాట్లాడకండని రిషి అంటాడు. నా కొడుకు ఎటు వెళ్ళాడని మీ డాడ్ అడిగితే నేనేం చెప్పాలని జగతి అంటుంది. మోసం చేసి పారిపోయాడని చెప్పి నమ్మించండని రిషి అంటాడు. మీరు నన్ను వదిలి వెళ్ళిపోయాక.. నాకు చాలా బాధగా ఉండేది. మీరు వచ్చాక మిమ్మల్ని చాలా సార్లు అమ్మ అని పిలువాలని అనుకున్నాను కానీ ఇలాంటి ఒక రోజు వస్తుంది అనుకోలేదు. తల్లిని క్షేమించే కొడుకు ఇంకా పుట్టలేదు అనుకుంటా కానీ కొడుకుగా కాపాడుకుంటున్నాను.. నన్ను చంపేశావ్ కదా అమ్మా అని రిషి అనగానే.. తను అలా అమ్మా అని పిలిచేసరికి జగతి ఎమోషనల్ అవుతుంది. రిషి నువ్వు నన్ను అమ్మా అని పిలిచావా అని జగతి అంటుంది. జీవితంలో ఈ పిలుపు వినలేదనే దిగులు మీకు ఉండొద్దు.. మీకు ఇక కన్పించనని చెప్పి రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

రిషి వెళ్తుంటే వసుధార వెనకాల నుండి వెళ్ళి హాగ్ చేసుకొని రిషిని వెళ్లకుండా ఆపుతుంది. కానీ రిషి వసుధారని గట్టిగ వెనక్కి నెట్టేస్తాడు. కారణం తనని వసుధార మోసం చెయ్యడం రిషి భరించలేకపోతాడు. ఇకనుండి రిషిధార కాదు వసుధార అని వేలుకి ఉన్న VR రింగ్ ని తీసి వసుధార చేతిలో పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.