Read more!

English | Telugu

'డ్రామా జూనియ‌ర్స్' కోసం మేక‌ప్.. ఫొటోలు షేర్ చేసిన రేణు దేశాయ్‌!

 

రేణూ దేశాయ్ బిజీగా మారారు. టీవీ రియాలిటీ షో 'డ్రామా జూనియ‌ర్స్' సీజ‌న్ 5 షూటింగ్‌లో ఏప్రిల్ 5 నుంచి పాల్గొంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఆమె, త‌న తొలిరోజు షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను షేర్ చేసుకున్నారు. త‌ను మేక‌ప్ వేసుకుంటున్న పిక్చ‌ర్స్‌తో పాటు, షో ఓపెనింగ్‌కు సంబంధించిన షాట్‌ను కూడా ఆమె షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ షో షూటింగ్ అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో జ‌రుగుతోంది. 

ఈ షోలో రేణుతో పాటు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఎస్వీ కృష్ణారెడ్డి, సింగ‌ర్ సునీత జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. కృష్ణారెడ్డి ఓ టీవీ షోకు ప‌నిచేయ‌డం ఇదే తొలిసారి. అలాగే ఒక టీవీ షోకు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించ‌డం సునీత‌కూ తొలిసారే. ఈ షోలో పాల్గొంటున్న‌ పిల్ల‌ల‌తో క‌లిసి ముగ్గురు జ‌డ్జిలు స‌ర‌దాగా గ‌డుపుతున్న టీజ‌ర్‌ను టీవీ చాన‌ల్ రిలీజ్ చేసింది.

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా విధించిన లాక్‌డౌన్ కంటే ముందుగానే ఈ షోను అనౌన్స్ చేశారు. అప్ప‌ట్లో రేణు దేశాయ్‌, ఖుష్బూ సుంద‌ర్‌, అన‌సూయ జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని అనుకున్నారు. ఇప్పుడు ఖుష్బూ, అన‌సూయ ప్లేస్‌లో కృష్ణారెడ్డి, సునీత వ‌చ్చారు.

మునుప‌టి సీజ‌న్ల మాదిరిగానే డ్రామా జూనియ‌ర్స్ సీజ‌న్ 5కు ప్ర‌దీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్య‌వ‌రించ‌నున్నాడు. ఇందులో కొంత‌మంది పిల్ల‌లు త‌మ యాక్టింగ్ టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.