English | Telugu

నేనున్నానంటే మినిమ‌మ్ ఉండాలి.. బ‌రాబ‌ర్ ఇచ్చెయ్య‌డ‌మే!

పెళ్లి త‌ర్వాత సింగ‌ర్ సునీత మ‌రింత హుషారుగా, మ‌రింత అందంగా క‌నిపిస్తున్నారు. ప‌లు టీవీ మ్యూజిక‌ల్ షోల‌లో సింగ‌ర్‌గా అల‌రిస్తూ వ‌స్తోన్న ఆమె తొలిసారి ఓ టీవీ షోకు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించేందుకు రెడీ అయ్యారు. జీ తెలుగులో ప్ర‌సారం కానున్న‌ డ్రామా జూనియ‌ర్స్ షోలో ఆమె డైరెక్ట‌ర్ ఎస్వీ కృష్ణారెడ్డి, న‌టి రేణు దేశాయ్‌ల‌తో పాటు జ‌డ్జి బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు.

టాప్ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సీజ‌న్ 4 షో ఈ నెల 11న రాత్రి 8 గంట‌ల‌కు ప్రారంభం కానున్న‌ది. మొద‌ట మెగా ఆడిష‌న్స్ పేరిట ఈ షో ఆడిష‌న్స్ ఎలా నిర్వ‌హించారో చూపించ‌నున్నారు. ఈ షో ఫ‌స్ట్ ఎపిసోడ్‌లో గ్రీన్ క‌ల‌ర్ శారీ, మ‌ల్టీ క‌ల‌ర్ బ్లౌజ్ ధ‌రించి అందంగా ముస్తాబై వ‌చ్చిన సునీత స్టేజిపై మైక్ ప‌ట్టుకొని మాట్లాడుతూ, నేనున్నానంటే మినిమ‌మ్ ఉండాలి.. బ‌రాబ‌ర్ ఇచ్చెయ్య‌డ‌మే ఈ షోలో అని హుషారుగా హావ‌భావాలు ఒలికిస్తూ చెప్ప‌‌డం, ప్ర‌దీప్ రెండు చేతులూ గుండెపై పెట్టుకొని అమ్మ‌బాబోయ్ అన‌డం ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌దీప్ అలా అన‌డంతో బిగ్గ‌ర‌గా న‌వ్వేశారు సునీత‌.

ప‌లువురు పిల్ల‌లు డ్రామా జూనియ‌ర్స్ షోలో త‌మ‌లోని యాక్టింగ్‌ టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. అన‌సూయ‌, ఓంకార్ జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రించిన మునుప‌టి సీజ‌న్ మంచి స‌క్సెస్ అయ్యింది. ఇప్పుడు కృష్ణారెడ్డి, రేణు, సునీత జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌టంతో ఈ సీజ‌న్ మ‌రింత ర‌క్తిక‌ట్టే అవ‌కాశం ఉంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.