English | Telugu

కోడి రామకృష్ణతో గొడ‌వ‌.. దాస‌రితో చెంప‌దెబ్బ‌.. బ‌య‌ట‌పెట్టిన రేలంగి!

దర్శకరత్న దాసరి నారాయణరావు స్వగ్రామం పాలకొల్లు. ఆయన శిష్యులుగా పరిశ్రమలోకి వచ్చి, పలు విజయవంతమైన చిత్రాలు తీసిన కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావులది కూడా పాలకొల్లే. అంతే కాదు... వాళ్ళిద్దరూ స్కూల్‌మేట్స్‌, క్లాస్‌మేట్స్‌ కూడా! ఆరో తరగతి చదివే సమయంలో కోడి రామకృష్ణతో రేలంగి నరసింహారావు గొడవ పడ్డారు. తర్వాత మళ్ళీ దర్శకుడైన తర్వాత కలిశారు. వచ్చే వారం ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన రేలంగి నరసింహారావు ఈ విశేషాలు పంచుకున్నారు.

‘‘కోడి రామకృష్ణ నాకు చిన్ననాటి స్నేహితుడు. అందుకని, నేనే తన ఇంటికి వెళ్ళాను. ‘ఒరేయ్‌ అబ్బాయ్‌! జిన్నా వచ్చాడు... జిన్నా వచ్చాడు’ అని ఎంతో సంబరపడ్డాడు. పాలకొల్లులో నన్నంతా రేలంగి జిన్నా అంటారు. నా ముద్దుపేరు అది’’ అని చెప్పుకొచ్చారు రేలంగి నరసింహారావు. అలాగే, రాజేంద్రప్రసాద్‌ హీరోగా 32 చిత్రాలకు దర్శకత్వం వహించానని, తామిద్దరం భార్యభర్తలం లాంటోళ్ళమని, రాజేంద్రప్రసాద్‌తో ఎటువంటి గొడవలు లేవన్నారు. హీరో సుమన్‌ను ‘ఇద్దరు కిలాడీలు’ చిత్రంతో వెండితెరకు తానే పరిచయం చేశానని రేలంగి తెలిపారు.

సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నప్పుడు, తెలియక ఎంతో పవిత్రంగా భావించే క్లాప్‌ బోర్‌ను కిందపెట్టి ఏదో రాసుకుంటుంటే త‌మ‌ గురువు దాసరి నారాయణరావు వచ్చి ఛెళ్ళున కొట్టిన ఘటనను గుర్తు చేసుకున్నారు రేలంగి. ‘ఎప్పుడూ నా కళ్ల ముందు ఇటువంటి పని చేయకు’ అని దాసరి చెప్పారన్నారు. ఒకానొక సమయంలో కాకాపట్టేవాళ్ళను ముందు పెడుతున్నారని గురువుగారి కాళ్ళకు నమస్కరించి తాను వెళ్ళిపోయానని రేలంగి చెప్పారు. అప్పుడు రెండు కన్నీటి చుక్కలు ఆయన కాళ్ళ మీద పడ్డాయట. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయ్యాక చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.