English | Telugu
రతిక రీఎంట్రీ.. బిగ్ బాస్ ఉల్టా పల్టాతో మైండ్ బ్లాక్!
Updated : Oct 19, 2023
బిగ్ బాస్ హౌస్ లో రతిక శకం ముగిసిందని అనుకున్నారంత. కానీ ఆట మళ్ళీ మొదలవబోతుంది. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ లకి అటు కంటెస్టెంట్స్ కి ఇటు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే హౌస్ లో వీళ్ళు బాగా ఆడట్లేదని అనుకున్న ప్రతీసారీ వాళ్లని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా మారుతున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే కిరణ్ రాథోaడ్, షకీల, రతిక, దామిణి, శుభశ్రీ, నయని పావని వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళారు. దీంతో బిగ్ బాస్ ఆట మరింత క్రేజ్ పొందడానికి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్నాడు. హౌస్ లోకి 2.0 గా అయిదుగురు కొత్త కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి ఒక ట్విస్ట్ ఇవ్వగా, ఇప్పుడేమో దామిణి, శుభశ్రీ, రతికరోజ్ లలో ఒకరిని హౌస్ లోకి తీసుకురావటానికి ఓటింగ్ పెట్టాడు బిగ్ బాస్. గత వారం వీళ్ళ ముగ్గురిని హౌస్ లోకి పిలిపించిన నాగార్జున.. ఓటింగ్ రిక్వెస్ట్ చేపించాడు. ఎవరైతే హౌస్ లో బాగుంటుందని అనుకుంటున్నారే వారికే ఓటేయ్యండని హౌస్ మేట్స్ తో బిగ్ బాస్ చెప్పగా ఎక్కువ మంది శుభశ్రీకి వేసినట్లు, ఇక మిగతా సగం దామిణికి వేసినట్లుగా తెలుస్తుంది.
అయితే అందరు ఓటింగ్ చేసాక నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. ఇది ఉల్టా పుల్టా అంటూ ట్విస్ట్ ని రివీల్ చేశాడు. ఎక్కువ ఎవరికి ఓటింగ్ చేస్తారో వారు కాదు ఎవరికి లీస్ట్ ఓటింగ్ పడుతుందో వారే హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తారని చెప్పగా హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటు ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా రతిక ఇన్ స్టాగ్రామ్ లో రీ ఎంట్రీ గురించి పోస్ట్ చేసింది. " లైఫ్ లో ఎవరికి సెకెండ్ ఛాన్స్ రాదు. వచ్చిందంటే దానిని సరిగ్గా వాడుకోవాలి. మనం గతంలో చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి" అని మా నాన్న చెప్పాడంటూ పోస్ట్ లో చెప్పుకొచ్చింది రతిక. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఒకసారి రతిక హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే అపోజిట్ కంటెస్టెంట్స్ కి బ్యాండ్ బాజే అని తన అభిమానులు అంటున్నారు.