English | Telugu

రతిక రీఎంట్రీ.. బిగ్ బాస్ ఉల్టా పల్టాతో మైండ్ బ్లాక్!

బిగ్ బాస్ హౌస్ లో రతిక శకం ముగిసిందని అనుకున్నారంత. కానీ ఆట మళ్ళీ మొదలవబోతుంది. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ లకి అటు కంటెస్టెంట్స్ కి ఇటు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే హౌస్ లో వీళ్ళు బాగా ఆడట్లేదని అనుకున్న ప్రతీసారీ వాళ్లని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా మారుతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే కిరణ్ రాథోaడ్, షకీల, రతిక, దామిణి, శుభశ్రీ, నయని పావని వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళారు. దీంతో బిగ్ బాస్ ఆట మరింత క్రేజ్ పొందడానికి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్నాడు. హౌస్ లోకి 2.0 గా అయిదుగురు కొత్త కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి ఒక ట్విస్ట్ ఇవ్వగా, ఇప్పుడేమో దామిణి, శుభశ్రీ, రతికరోజ్ లలో ఒకరిని హౌస్ లోకి తీసుకురావటానికి ఓటింగ్ పెట్టాడు బిగ్ బాస్. గత వారం వీళ్ళ ముగ్గురిని హౌస్ లోకి పిలిపించిన నాగార్జున.. ఓటింగ్ రిక్వెస్ట్ చేపించాడు. ఎవరైతే హౌస్ లో బాగుంటుందని అనుకుంటున్నారే వారికే ఓటేయ్యండని హౌస్ మేట్స్ తో బిగ్ బాస్ చెప్పగా ఎక్కువ మంది శుభశ్రీకి వేసినట్లు, ఇక మిగతా సగం దామిణికి వేసినట్లుగా తెలుస్తుంది.

అయితే అందరు ఓటింగ్ చేసాక నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. ఇది ఉల్టా పుల్టా అంటూ ట్విస్ట్ ని రివీల్ చేశాడు. ఎక్కువ ఎవరికి ఓటింగ్ చేస్తారో వారు కాదు ఎవరికి లీస్ట్ ఓటింగ్ పడుతుందో వారే హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తారని చెప్పగా హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటు ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా రతిక ఇన్ స్టాగ్రామ్ లో రీ ఎంట్రీ గురించి పోస్ట్ చేసింది. " లైఫ్ లో ఎవరికి సెకెండ్ ఛాన్స్ రాదు‌. వచ్చిందంటే దానిని సరిగ్గా వాడుకోవాలి‌. మనం గతంలో చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి" అని మా నాన్న చెప్పాడంటూ పోస్ట్ లో చెప్పుకొచ్చింది రతిక. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఒకసారి రతిక హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే అపోజిట్ కంటెస్టెంట్స్ కి బ్యాండ్ బాజే అని తన అభిమానులు అంటున్నారు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.