English | Telugu

ముడ్డి కడిగే వయసులో మెలోడీ సాంగ్స్ అవసరమా...రాత్రి ఎందుకు పిలిచారు అన్న రష్మీ


శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో భలే ఫన్నీగా ఉంది. ఇందులో రాంప్రసాద్ నులక మంచం మీద నిద్రపోవడం, కలలో ఒక సౌందర్య రాశి రావడం ఆ మంచం పక్కన కాలి పట్టీ వదిలేసి వెళ్లడం దాన్ని రాంప్రసాద్ తీసుకుని ఆ అమ్మాయి గురించి తెలుసుకోలేని అనుకోవడం అంతా ఫన్నీగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి రాంప్రసాద్ తన ఫ్రెండ్స్ ని పిలుస్తాడు. అలా రష్మీ, ఇంద్రజ అంతా వస్తారు. "రాత్రికి ఎందుకు పిలిచారు" అని రష్మీ డౌట్ తో అడిగేసరికి "నైట్ టైం జరిపిస్తామని తెలీదా మీకు" అన్నాడు రాంప్రసాద్ గుసగుసగా. వెంటనే ఇంద్రజ గట్టిగా అరిచేసరికి "అదే ఊళ్ళో జాతర ఒకటి చేయాలి అందుకే పిలిపించాం" అన్నాడు రాంప్రసాద్. తర్వాత రాకెట్ రాఘవ మంచి రొమాంటిక్ సాంగ్ తో డాన్స్ ఇరగదీసేసరికి వాళ్ళ అబ్బాయి వచ్చి "ముసలోడికి దసరా పండగ అంటే ఇదేనేమో..ముడ్డి కడిగే వయసులో మెలోడీ సాంగ్ లు కావాలా నీకు .చేయాలంటే గుమ్మాడి గుమ్మాడి అనే సాంగ్ చేయాలి కానీ గున్నా గున్నా మామిడి అంటావు రష్మీలా ఊగుతావు " అని చెప్పిన డైలాగ్ కి అంతా నవ్వేశారు.

తర్వాత నూకరాజు మంత్రగాడి వేషంలో అమ్రిష్ పురిలా వచ్చాడు. రాంప్రసాద్ నూకరాజు దగ్గరకు వచ్చి పట్టీ చూపించి "ఈ అమ్మాయి మిస్ అయ్యింది ఎక్కడ ఉంది" అని అడిగాడు..."ఆ పిల్ల ఎక్కడ ఉందో చెప్తాను" అంటూ వెంటనే ఏదో పొడి గాల్లోకి విసిరాడు నూకరాజు .."కనపడిందా" అని మరో కమెడియన్ అడిగేసరికి "లేదు పొడి కళ్ళల్లో పడింది" అని కామెడీ పంచ్ వేసాడు నూకరాజు. మరో కమెడియన్ వచ్చి "నా పెళ్ళాం కనిపించడం లేదు..ఎప్పుడొస్తుంది" అని మంత్రగాడి గెటప్ లో ఉన్న నూకరాజుని అడిగేసరికి "రెండు రోజుల తర్వాత వస్తుంది..నేను అప్పుడే పంపిస్తాను" అని నవ్వుతూ చెప్పేసరికి అందరూ షాకయ్యారు. తర్వాత కొన్ని కామెడీ టాస్క్స్ ఇచ్చి వాళ్లందరితో గేమ్స్ ఆడించింది రష్మీ.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.