Read more!

English | Telugu

పల్లవి ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ లాగేసుకున్న బిగ్ బాస్.. శివాజీ ఎమోషనల్!

బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పటికే అయిదు వారాలు పూర్తి చేసుకొని ఆరవ వారం కొనసాగుతుంది. ఇందులో కెప్టెన్సీ పోటీ కోసం బిగ్ బాస్ రకరకాల టాస్క్ లు ఇస్తున్నాడు.

పల్లవి ప్రశాంత్ కష్టపడి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అయితే బిగ్ బాస్ లైవ్ లో అందరి ముందు తను కెప్టెన్సీ బ్యాడ్జ్ ని తీసేసుకున్నాడు. హౌజ్ లోని వారిని అసలు కెప్టెన్ భాద్యతలు ఏంటివి అని వారి అభిప్రాయం తెలుసుకున్నాడు బిగ్ బాస్.  కాస్త కమాండింగ్ ఉంటే బాగుండు అని పూజామూర్తి అంది. బిగ్ బాస్ తర్వాత కెప్టెనే బిగ్ బాస్ అని అంబటి అర్జున్ అన్నాడు.

మేనేజింగ్ స్కిల్స్ ఉండాలని ఆట సందీప్ అన్నాడు‌. అందరిని ప్రాపర్ గా చూసుకుంటు వారిచేత సరిగ్గా పనులు చేపించాలని సీరియల్ బ్యాచ్ అన్నారు. ఇక పల్లవి ప్రశాంత్ కెప్టెన్ గా సరిగ్గా చేశాడని ఎవరు అనుకుంటున్నారో చేతిని లేపండి అని అనగా.. సీరియల్  సీరియల్ బ్యాచ్ లోని అమర్ దీప్, ఆట సందీప్, శోభా శెట్టి తప్ప అందరు పల్లవి ప్రశాంత్ కెప్టెన్ గా సరిగానే చేశాడని చెప్పారు. అయితే పల్లవి ప్రశాంత్ తన వివరణ ఇచ్చాడు. కొందరు ఏం చెప్పినా చేయట్లేదని, వీడు చెప్తే వినేదేంది అన్నట్టుగా చూస్తున్నారని తను ఎదుర్కొంటున్న వాటిని  పల్లవి ప్రశాంత్ చెప్పాడు.

పల్లవి ప్రశాంత్ కెప్టెన్  గా సరిగ్గా చేయలేదని బిగ్ బాస్ బ్యాడ్జ్ లాగేసుకున్నాక గార్డెన్ ఏరియాకి వెళ్ళి ఏడ్చేశాడు ప్రశాంత్. అక్కడే ఉన్న శివాజీ.. కాసేపు ఓదార్చాడు. ఆ తర్వాత అతను కూడా ఎమోషనల్ అయ్యాడు. ‌ఇక లోపలికి వెళ్ళి అమర్ దీప్, అశ్విని శ్రీలతో పల్లవి ప్రశాంత్ గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు శివాజీ.

హౌజ్ మేట్ అయిన ఒక్కరోజుకే అతని పవరస్త్రాని లాగేసుకున్నారు. ఇప్పుడు కాళ్ళు, చేతులు విరగ్గొట్టుకొని ఆడి గెలిస్తే.‌‌. ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ ని తీసేసుకుంటారా అంటు వాపోయాడు శివాజీ. అతడిని చూసి అందరు ఎమోషనల్ అయ్యారు. ఇక  గార్డెన్ ఏరియాలో భోలే శావలి కూడా పల్లవి ప్రశాంత్, శివాజీల మధ్య  గల స్వచ్ఛమైన స్నేహాన్ని చూసి ఏడ్చేశాడు. ఇద్దరిది గురుశిష్యుల బంధమని, ఇలా ఎవరూ ఉండరని, బహుశా ఇక్కడే చూస్తున్నానంటూ పల్లవి ప్రశాంత్ తో చెప్తూ భోలే శావలి ఏడ్చేశాడు.