English | Telugu

Jayam serial: వీరూనే అదంతా చేశాడని తెలుసుకున్న గంగ.. ఏం చేయనుంది?

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -156 లో... శేఖర్ నిజం చెప్పాలని గంగ యాక్టింగ్ చేస్తుంది. దాంతో శేఖర్ నిజం చెప్తాడు. అదంతా రుద్ర వింటాడు. అసలు నీతో ఇదంతా ఎవరు చేస్తున్నారన్నా అని గంగ అనగానే శేఖర్ పారిపోతాడు. శేఖర్ కి ఎదురుగా రుద్ర వచ్చి ఆపుతాడు. గంగ, శ్రీనన్న వస్తారు. గంగ చెంప రుద్ర చెల్లుమనిపిస్తాడు. అసలు నువ్వు ఇలా ఎందుకు యాక్టింగ్ చేసావ్.. ఇంకా ఇంట్లో నుండి లెటర్ రాసి పెట్టి వచ్చావ్.. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని గంగపై రుద్ర కోప్పడతాడు.

ఆ తర్వాత శేఖర్ ని రుద్ర బెదిరించగా జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో నిన్ను కాంటాక్ట్ అయిన నెంబర్ ఇవ్వమని రుద్ర అనగానే అతను నెంబర్ ఇస్తాడు. రుద్ర అతనికి ఫోన్ చేస్తాడు ఫోన్ స్విచాఫ్ వస్తుంది. అత్తయ్య ముందు శేఖరన్నా నువ్వు నిజం చెప్పాలని తనని ఇంటికి తీసుకొని వెళ్తారు... గంగని చూసి ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగ చెంపపై వేలిముద్ర చూసి ఎవరు కొట్టారని పెద్దసారు అడుగుతాడు. నేనే కొట్టాను నిజం చెప్పించడానికి చనిపోయినట్లు యాక్టింగ్ చేసింది అందుకే కొట్టానని రుద్ర చెప్తాడు. శేఖర్ రాగానే వీరు టెన్షన్ పడతాడు. శేఖర్ ఇంట్లో వాళ్ళకి జరిగింది మొత్తం చెప్తాడు. నన్ను బ్లాక్ మెయిల్ చేసిన అతను కూడా వీరు సర్ లాగే పొడవు ఉంటారని శేఖర్ చెప్తాడు.

ఆ తర్వాత గంగ చెంపపై ఉన్న నొప్పికి ఇబ్బంది పడుతుంటే రుద్ర వచ్చి కూల్ బ్యాగ్ ఇచ్చి పెట్టుకోమ్మంటాడు. అనుకోకుండా రుద్ర వెళ్లిపోతుంటే గంగపై పడుతాడు. గంగ రొమాంటిక్ గా ఫీల్ అవుతుంది. సారీ గంగ నిన్ను కొట్టినందుకు అని చెప్పి వెళ్లిపోతుంటే గంగ సిగ్గుపడుతుంది. మరొకవైపు ఆ శేఖర్ గాడు లాస్ట్ మినిట్ లో ఇలా చేసాడని ఇషిక, వీరు డిజప్పాయింట్ అవుతారు.

ఆ తర్వాత వీరు దగ్గరికి గంగ వచ్చి ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసు అన్నయ్య అని గంగ అనగానే వీరు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.