English | Telugu

Brahmamudi: విషం కలిపిన పసరు మందుని తాగిన కావ్య.. రుద్రాణి ప్లాన్ సక్సెస్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-919 లో... రాజ్ బావ నాకు కావాలని రేఖ అనగానే దానికి రాహుల్ ఒప్పుకొని కావ్య కడుపులో బిడ్డని లేకుండా చేయాలని చెప్తాడు. రేఖని ఆ ఇంటికి కోడలుగా చెయ్యాలని రాహుల్ ప్లాన్ చెయ్యగా.. చాలా థాంక్స్ అన్నయ్య అని రేఖ అంటుంది. మీరు ఇద్దరు ఒకే అంటే చేసేదేముంది నా కూతురు ఈ ఇంటికి కోడలు అవుతుంది.. అంతకంటే ఏముందని రుద్రాణి అంటుంది.

మరొకవైపు ఇద్దరు అక్కాచెల్లెలు అప్పు, కావ్య కడుపుతో కూర్చొలేక నిల్చొలేక ఇబ్బందిపడుతారు. దాంతో అప్పు, కావ్య ఇద్దరు తమ భర్తల దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇలా రెస్ట్ తీసుకొమ్మంటే మాకు ఇబ్బందిగా ఉందని అంటారు.

ఇక రాత్రి రుద్రాణికి పసరు మందు వైద్యుడు ఫోన్ చేసి మీరు చెప్పిన మందు తీసుకొని వచ్చానని చెప్పగానే సరే ఉండు వస్తున్నానని రుద్రాణి వెళ్తుంది. అప్పుడే తనకి ప్రకాష్ ఎదురుపడుతాడు. దాంతో రుద్రాణి భయపడుతుంది. కానీ ప్రకాష్ నిద్రలో నడుస్తాడు అది చూసి రుద్రాణి రిలాక్స్ అవుతుంది. ఇక రుద్రాణి బయటకు వెళ్లి పసరు మందు తీసుకొని వస్తుంది.

మరుసటి రోజు ప్రకాష్, సుభాష్ ఆఫీస్ కి వెళ్ళడానికి త్వరగా టిఫిన్ చేస్తుంటారు. దాంతో రాజ్ వచ్చి ఎవరు ఈ రోజు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్తాడు.

మరొకవైపు రాజ్ గదిలోకి రుద్రాణి, రేఖ వెళ్లి పసరు మందు తను తాగే ఆయుర్వేద మందులో కలుపుతారు. ఈ దెబ్బతో కావ్య బిడ్డ ఉండదని రుద్రాణి, రేఖ అనుకుంటారు.

ఆ తర్వాత ఏదో ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రామ్ అన్నావ్ రాజ్ ఎక్కడ అని ప్రకాష్ అనగానే.. రాజ్, కళ్యాణ్ కలిసి కొన్ని చీటీలు రాసి అందులో ఏది వస్తే అది చెయ్యాలని చెప్తారు.

తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ఆయుర్వేద మందు ఇస్తాడు. అది కావ్య తాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.