Read more!

English | Telugu

నా ఫోకసే వేరంటున్న అనసూయ!

అనసూయ భరద్వాజ్.. టెలివిజన్ రంగంలో యాంకర్ గా అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ..‌ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించిన అనసూయ.. రంగమార్తాండ సినిమాలో మంచి పాత్రని చేసానని మీడీయా ముందు ఎమోషనల్ అయింది. అంతే కాకుండ తాజాగా విడుదల అయినా విమానం సినిమా ద్వారా తనలోని పూర్తి స్థాయి నటి బయటకు వచ్చిందని చెప్పాలి. విమానం సినిమా అనసూయకి మంచి గుర్తిoపు తెచ్చింది.

అనసూయ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వీకెండ్ పార్టీలని, హోమ్ టూర్ అని, సమ్మర్ వేకేషన్ అంటూ తన ప్రతీ అప్డేడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. అయితే నిన్న మొన్నటిదాకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవ పడుతూ పోస్ట్ లు చేసిన అనసూయ‌. ఆ గొడవ సర్దుమణిగిందనేలోపే మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. జ్యువలరీ ప్రమోషన్స్, శారీ ప్రమోషన్స్ అంటూ బ్రాండ్స్ కోసం ప్రచారం చేస్తూ బిజీగా ఉంటోంది అనసూయ.

మాములుగా వీకెండ్ ప్లాన్స్ అంటూ శుక్రవారం నుండే ఇన్ స్టాగ్రామ్ లో తన అప్డేడ్స్ ని షేర్ చేసే అనసూయ.. ఇప్పుడు వీక్ స్టార్టింగ్ లోనే  మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటో షూట్ ఫోటోలని అప్లోడ్ చేసింది. ఒక్కో ఫోటోలో ఒక్కో స్టిల్ తో బోల్డ్ గా కనిపిస్తుంది. "నేను ఎవరిని ఇంప్రెస్ చేయను. నేను అప్డేట్ అవుతుంటాను. నా ఫోకసే వేరు" అంటూ ఈ పోస్ట్ కి క్యాప్షన్ కూడా పెట్టేసింది అనసూయ. కాగా ఈ ఫోటోలు చూసిన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అనసూయ మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది.