English | Telugu
'మీమ్ వేస్కో.. ఐఫోన్ తీస్కో'.. నాగబాబు స్కెచ్!
Updated : May 1, 2021
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్యకాలంలో అతడి ఫోకస్ మొత్తం యూట్యూబ్ పైనే ఉంది. రీసెంట్ గా నాగబాబు 'అదిరింది' షోలో స్కిట్ లు చేసిన కొందరు కమెడియన్స్ తో 'బస్తీ బాయ్స్' అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. 'జాతిరత్నాలు' టైప్ లో ఈ సిరీస్ ను ప్లాన్ చేశారు. రెండు రోజుల క్రితం ఈ వెబ్ సిరీస్ లో మొదటి ఎపిసోడ్ ను విడుదల చేశారు. దానికి మంచి స్పందనే వస్తోంది. ఇప్పటికీ ఈ ఎపిసోడ్ ట్రెండింగ్ లోనే ఉంది. తన యూట్యూబ్ చానెల్ సబ్ స్క్రైబర్స్ 500k దాటిపోవడంతో ఫుల్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు నాగబాబు.
అయితే ఇప్పుడు 'బస్తీ బాయ్స్'ను మరింత ప్రమోట్ చేయడానికి నాగబాబు రెడీ అయ్యారు. ఈ మేరకు మీమర్స్ సాయం తీసుకుంటున్నారు. నాగబాబుకి మీమ్స్ అన్నా.. మీమర్స్ అన్నా ఎంతో ఇష్టం. ఇది వరకే మీమర్స్ తో నాగబాబు స్పెషల్ గా ఇన్స్టాగ్రామ్ లో లైవ్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో చాలా మంది మీమ్ క్రియేటర్స్ నాగబాబుతో మాట్లాడారు. ఇప్పుడు నాగబాబు మీమర్స్ సాయంతో తన 'బస్తీ బాయ్స్'ను మరింత ఫేమస్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ కాంటెస్ట్ ను రన్ చేస్తున్నారు.
అందులో గెలిచిన వారికి ఐఫోన్ బహుమతిగా ఇస్తానని చెప్పారు. ''మీమ్స్ అలెర్ట్.. మీమ్ వేస్కో .. ఐఫోన్ తీస్కో'' అనే కాంటెస్ట్ ను పెట్టారు. బస్తీ బాయ్స్ ఎపిసోడ్స్ అన్నీ చూసి మీమ్స్ వేస్తే.. హయ్యస్ట్ రీచ్ వచ్చిన మీమ్ కి ఐఫోన్ ఇస్తామని.. ఈ కాంటెస్ట్ బస్తీ బాయ్స్ లాస్ట్ ఎపిసోడ్ వరకు ఉంటుందని.. మీమ్ డిస్క్రిప్షన్లో #basthiboysmemes అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలని నాగబాబు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఐఫోన్ తో మీమర్స్ ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు నాగబాబు. మరి ఆయన ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!
