English | Telugu

లెటర్ తో ప్రపోజ్ చేసిన  మురారి.. ఇక అన్నీ మంచి శకునాలే!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -290 లో.. కృష్ణ ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది. కృష్ణ ఎక్కడికి వెళ్లాలో తెలియక హాస్పిటల్ కి వెళ్లి బాధపడుతుంటుంది. మురారి కృష్ణకీ ఒక లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్ లో ఏం ఉంటుందంటే.. గతంలో ముకుంద ప్రేమ గురించి, ప్రస్తుతం కృష్ణని ప్రేమిస్తున్న విషయం లెటర్ లో రాస్తాడు మురారి. అది చదివిన కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత లెటర్ లో మురారి రాసింది చూసి కృష్ణ మురిసిపోతుంది. అప్పుడే కృష్ణ దగ్గరికి రేవతి వస్తుంది. కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుండడం చూసి.. ఏమైందని అడుగుతుంది. కృష్ణ లెటర్ ఇస్తుంది. అది రేవతి చదివి సంతోషపడుతుంది. ఇద్దరు హ్యాపీగా కలిసి ఉండండని కృష్ణకి రేవతి చెప్తుంది. మీరిద్దరు కలిసి అక్క ముందుకు రండి. అక్క మిమ్మల్ని అర్థం చేసుకుంటుందని కృష్ణకు రేవతి చెప్తుంది. మరొక వైపు నేను అనుకున్నది జరిగిందని ముకుంద అనుకుంటుంది. అప్పుడే రేవతి అటుగా నవ్వుతు వెళ్తు కన్పిస్తుంది.. ఏంటి తనకు ఇష్టమైన కోడలు ఇంట్లో నుండి బయటకు వెళ్ళింది. మరి రేవతి అత్తయ్య ఎందుకు హ్యాపీగా ఉందని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ముకుంద దగ్గరికి రేవతి వస్తుంది. ఏంటి హ్యాపీగా ఉన్నారని ముకుంద అడుగుతుంది. నీకు ఇంట్లో జరిగింది మాత్రమే తెలుసు నాకు బయట ఏం జరుగుతుందో కూడా తెలుసు అని చెప్పిన రేవతి, నవ్వి వెళ్ళిపోతుంది. ముకుందకి ఏం అర్థం కాదు.

మరోక వైపు మధు కోసం అలేఖ్య వెయిట్ చేస్తుంటుంది. కాసేపటికి మధు వస్తాడు. కృష్ణ ఎక్కడికి వెళ్ళిందని అనగానే.. అలేఖ్య చెంప చెల్లుమనిపిస్తాడు మధు. నువ్వు ఇంకొక సారి ముకుంద తో కన్పిస్తే బాగుండదంటూ వార్నింగ్ ఇస్తాడు. మరొక వైపు మురారి దగ్గరికి కృష్ణ బయల్దేర్తుంది. రేవతి దేవుడికి మొక్కుకుంటుంది. అప్పుడే మధు వస్తాడు. కృష్ణని ప్రేమిస్తున్నట్టు మురారి లెటర్ లో రాసి చెప్పాడనే విషయం మధుకి రేవతి చెప్పగానే మధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక వైపు ప్రభాకర్ కృష్ణ కోసం వాళ్ళింటికి వస్తాడు. ముకుంద కృష్ణని గేoటేసామని చెప్పగానే.. ఎందుకు ఏం జరిగిందంటు భవానిని నిలదీస్తాడు ప్రభాకర్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.