English | Telugu

అవినాష్ పెళ్లి ఫిక్స్‌!.. ఫోటో వైరల్!!

ఈ మధ్యకాలంలో బుల్లితెర తారలు తమ ఈవెంట్స్ ను, స్కిట్స్ ను సరికొత్తగా ప్రామిస్ చేసుకుంటున్నారు. పెళ్లి అయినట్లు, ఎంగేజ్మెంట్ జరిగినట్లు ప్రాంక్ పోస్ట్ లు పెడుతున్నారు. రీసెంట్ గా జబర్దస్త్ వర్ష‌ ఇలానే పెళ్లి చేసుకోబోతున్నట్లు పోస్ట్ లు పెట్టి హల్చల్ చేయగా.. అదంతా స్కిట్ కోసమని తెలుసుకున్న నెటిజన్లు ఆమెని ట్రోల్ చేశారు.

ఇప్పుడు తాజాగా 'జబర్దస్త్' అవినాష్ కూడా ఇదే రూట్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షో అనంతరం అవినాష్ స్టార్ మాలోనే పలు ఈవెంట్స్ చేస్తూ.. తన కామెడీ స్కిట్ లతో అలరిస్తున్నాడు. కామెడీ స్టార్స్ షోలో అవినాష్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అవినాష్ షేర్ చేసిన ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.

పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న అవినాష్ ని చూసిన వారంతా షాకయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు అవినాష్ పెళ్లి విషయంపై ఎంత రచ్చ చేశారో తెలిసిందే. అవినాష్ కూడా పెళ్లి ఎప్పుడు అవుతుందా అన్నట్లు మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన్ను పెళ్లి గెటప్ లో చూసిన నెటిజన్లు 'పెళ్లి ఫిక్స్ అయిందా..?' అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం స్కిట్ కోసం ఇలా రెడీ అయి ఉంటాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. "ఈటీవీ వాళ్లు నీకు కూడా పెళ్లిచేస్తున్నారా బ్ర‌ద‌ర్ సెట్లో?" అని ఒక‌త‌ను అడిగాడు. మరి దీనిపై అవినాష్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి!


Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.