English | Telugu

Krishna Mukunda Murari : మీకు వేరే దిక్కులేదు.. ఆదర్శ్ తో మీ కూతురి పెళ్ళి చేసే భాద్యత నాది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -437 లో.. ఇంట్లో రజినీ.. ఆస్తిని సొంతం చేసుకునే ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇంతలో కృష్ణ అటుగా వెళ్లడం చూసిన రజినీ.. హేయ్ పిల్లా ఇలారా అని మర్యాద లేకుండా పిలుస్తుంది. అయిన కృష్ణ మర్యాదగా వచ్చి.. ఏంటి పిన్నీ అంటుంది. అవును ఆ ముకుంద ఎలా చనిపోయిందని‌ రజని అడుగుతుంది. తిక్కరేగిన కృష్ణ.. అంతా చనిపోయినట్లే చనిపోయింది. ప్రాణం గాలిలో కలిసిపోయిందంటు తిక్క తిక్కగా సమాధానం చెబుతుంది. దాంతో రజినీ రెచ్చిపోతూ.. ఏంటి నేనంటే నీకు భయం లేదా.. మర్యాద లేదా అంటూ అందరిని పిలిచి రచ్చ చెయ్యాలని చూస్తుంది. అంతా బయటికి వస్తారు.

అప్పుడే రజనీ గొడవ పెద్దది చేస్తుంటే తట్టుకోలేకపోయిన భవాని.. " రజినీ.. ఇప్పుడు ముకుంద పెద్దకర్మ చేసి వచ్చాం.. దాని పిండం కాకులు కూడా ముట్టలేదు.. మేమంతా అదే బాధలో ఉన్నాం. గొడవ చేయొద్దు.. ఏదైనా అవసరం ఉంటే రేవతిని అడుగు.. కృష్ణ ఆవిడితో కాస్త జాగ్రత్తగా ఉండు " అని అంటుంది. అయితే అప్పుడే మీరా తన నటనని మొదలెడుతుంది. ఏడుస్తూ కుర్చీలో కూలబడిపోతుంది. వెంటనే ఆదర్శ్, కృష్ణ కంగారుపడతారు. ఏమైంది మీరా అంటూ ఆదర్శ్.. ముకుందను అడుగగా.. ఇందాక ముకుందకు పిండం పెట్టేటప్పుడు ముకుంద వాళ్లనాన్న ఒక మాట అన్నారు.. నా కూతురు చనిపోలేదమ్మా నీలోనే ఉందని. ముకుందను చూసినట్లే నన్ను చూసేవారు. అందుకే నాలోని ఆయన కూతుర్ని చూసుకుంటానన్నారు. కానీ నేను ముకుంద అని ఎవరిని పిలవాలి ఆదర్శ్ గారు.. ముకుంద అన్న మాట ఎక్కడ వినాలి నేను.. ఈ బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది కదా ఆదర్శ్ గారు అని మీరా ఏడుస్తుంది. అది చూసిన కృష్ణ.. మీరా ఊరుకో అని ఓదారుస్తుంది. మనకు కావాల్సినవాళ్లు పోతే ఇలానే ఉంటుంది. కానీ కొన్నేళ్ల తర్వాత ఆ గుర్తులు ఆ మనసులు మెల్లగా మరుగున పడిపోతాయి. అంత వరకూ వాటిని మోయక తప్పదని భవాని అంటుంది. అవసరం లేదమ్మా.. ఏది మరిచిపోవాల్సిన అవసరంలేదు.. ఏ బాధ లేకుండా ఎప్పటికీ గుర్తించుకునే దారి ఉందని ఆదర్శ్ అంటాడు. ఏమన్నావ్ మీరా.. ముకుంద పేరుని ఎప్పుడు వినాలి ? ఎక్కడ వినాలని అన్నావ్ కదా? ఇప్పుడే వింటావ్.. ఇక్కడే వింటావ్.. సరిగ్గా విను మీరా.. అంతా వినండి. ఈ క్షణం నుంచి తన పేరు మీరా కాదు ముకుంద అని ఆదర్శ్ అంటాడు.

ఆదర్శ్ మాటలకు అంతా బిత్తరపోయి చూస్తుంటారు. అవును మీరా.. సారీ సారీ అవును ముకుంద.. ఈ రోజు నుంచి నీ పేరు మీరా కాదు ముకుంద.. అంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆదర్శ్ అంటాడు. అదికాదు బ్రో.. ముకుంద అనే పేరు వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో తెలుసు కదా.. మీరా అనే పేరు బాగానే ఉంది కదా అని మధు అంటాడు. తనకి బాలేదు.. ముకుంద అనే పేరు వినలేకపోవడం తనకు అసలు బాలేదు. అయిన ముకుంద తండ్రి ముకుందను మీరాలో చూసుకున్నప్పుడు మీకేంటి సమస్య అని ఆదర్శ్ అంటాడు. అమ్మా.. నువ్వేం మాట్లాడవా? నేనేదో ముకుంద మీద ప్రేమతో మాట్లాడటం లేదమ్మా.. అసలు ముకుంద అంటే మీకు ఎవరికీ ఇష్టం లేదని తెలుసు. కానీ మీ అందరికీ మీరా అంటే ఇష్టమే కదా అని ఆదర్శ్ అంటాడు. అందరికీ ఇష్టమే ఆదర్శ్.. కానీ తనకు ముకుంద పేరు ఎందుకని మధు అంటాడు. ఎందుకంటే తనకు ముకుంద అంటే ఇష్టం కాబట్టి నువ్వు ఏమంటావ్ అమ్మా? ప్లీజ్ అమ్మా ఈ ఒక్కదానికైనా ఒప్పుకో..మీరా మనసులోని బాధను తగ్గిద్దాం అమ్మా అని ఆదర్శ్ అంటాడు. కాసేపటికి రజినీ, సంగీతలున్న రూమ్ లోకి మీరా వస్తుంది. మగాడు మరిచిపోవడం.. మారిపోవడం ఎంత సేపు పిన్నిగారు.. ఇప్పుడు ఇలా నిరుత్సాహాపడిపోతే ఎలా.. వరస పెట్టి పిలిచినందుకు ఏం అనుకోవద్దని మీరా అంటుంది. వరస పెట్టి పిలిస్తే ఏం అనుకోను కానీ.. నీ వరసే బాలేదు. చచ్చిపోయిన వాడి పెళ్లాం పేరు నీకు పెట్టాడు. ఇక నా కూతురు వంక ఎందుకు చూస్తాడు? పైగా పేరు పెట్టగానే నువ్వు కూడా తలూపావ్..నీ మనసులో ఏముందని రజినీ అంటుంది. అయ్యో పిన్నీగారు మీరు అలా ఏం అనుకోవద్దు.. నాకు నిజంగానే ఆ ఉద్దేశం ఉంటే సాయం చేస్తానని మీకెందుకు చెబుతాను? ముందు మీరు నాకు ఒక మాట చెప్పండి.. ఎలాగైనా మీ అమ్మాయిని ఈ ఇంటికి కోడల్ని చెయ్యాలనుకుంటున్నారా లేదా అని రజినీతో మీరా అంటుంది. ఎక్కడికి పోయేది.. ఇక్కడ ఈ ఇల్లు తప్ప నాకు మా అమ్మకు వేరే దిక్కులేదని సంగీత అంటుంది. " ఆదర్శ్‌తో నీ కూతురు పెళ్లి చేసే బాధ్యత నాది " అంటూ సంగీత, రజినీలకు మాటిస్తుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.