English | Telugu

ముకుంద ముందే తన చీటీ చింపేసిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -282 లో.. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అందరు చీటీలలో కోరిక రాసి మీ పేరు రాయండని కృష్ణ చెప్పగానే.. అందరూ అలాగే చేస్తారు. ముకుంద అయితే ఏకంగా మురారి నా భర్తగారావాలి అని రాస్తుంది. అది చూసి అలేఖ్య టెన్షన్ పడుతుంది. అలా అందరు తమ కోరికను రాసి బౌల్ లో వేస్తారు.

ఒక్కొక్కరుగా వచ్చి వినాయకుడి ముందు గుంజీలు తీస్తుంటారు. ముకుంద నువ్వు తియ్యలేదు వచ్చి గుంజీలు తియ్యమని భవాని అనగానే ముకుంద వచ్చి తీస్తుంటే దేవుడుకి మొక్కుకొని తీయాలి కదా, నీకు పనిష్మెంట్ పదిహేను గుంజీలు తీయమని కృష్ణ అనగానే.. ముకుంద కోపంగా చూస్తుంది. భవాని చెప్పడంతో ముకుంద గుంజీలు తీస్తుంది.

ఆ తర్వాత భవాని చీటీలు ఒక్కొకటి తీస్తుంటుంది. ముందుగా ప్రభాకర్ తన కూతురు అల్లుడు సంతోషంగా ఉండాలని రాస్తాడు. ఆ తర్వాత మేమిద్దరం హ్యాపీగా ఉండాలని మురారి రాస్తాడు. ఆ తర్వాత ముకుంద చీటీ వస్తుంది. అందులో ఆదర్శ్ ని కలవాలని రాసి ఉంటుంది. అది విని ముకుంద షాక్ అవుతుంది. ఏంటి నేను రాసింది అది కాదు కదా ఎవరు రాశారని ఆలోచిస్తుంది. నువ్వు ఆదర్శ్ గురించి అంతగా ఆలోచిస్తున్నావంటు కృష్ణ అనగానే ముకుంద కోపంగా చూస్తుంది.

మరొకవైపు అలేఖ్య ఎప్పటిలాగే మధుని తిడుతూ ఉంటుంది. మరొక వైపు.. అసలు నేను రాసిన చీటీ ఏమైందని ముకుంద ఆలోచిస్తుంటుంది. అప్పుడే తన దగ్గరికి వచ్చిన కృష్ణ.. ఏం ఆలోచిస్తున్నావంటు అడిగి, తను చీటీ మార్చిన విషయం గురించి ముకుందకి చెప్తుంది. అలాగే ముకుంద రాసిన చీటీ తన ముందే చింపేసి పడేస్తుంది కృష్ణ. ఆ తర్వాత మురారి దగ్గరికి కృష్ణ వెళ్లి.. నాకు చాలా టెన్షన్ గా ఉందంటు కంగారుపడుతుంది. అది చూసిన మురారి.. ఏమైందని అడుగుతాడు. ఇందాకే ముకుంద దగ్గరికి వెళ్ళానని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.