Read more!

English | Telugu

ఆయన పశువులకు అర్జునరెడ్డి.. చలికి తట్టుకోలేనంటే హీరోయిన్స్ ని పెట్టాం

హండ్రెడ్ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గురించి, మంచి కామెడీ టైమింగ్ ఉన్న కృష్ణ భగవాన్ కలిస్తే ఎలా ఉంటుంది..కామెడీకి రెక్కలొచ్చినట్టు ఉంటుంది కదా. ఇక్కడ కూడా అలాగే ఉంది. "అమ్మ దీనెమ్మ బత్తాయో" మూవీ షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్లాం. ఐతే అక్కడ హీరో పృథ్వి చలికి తట్టుకోలేను అనేసరికి  ఇద్దరు హీరోయిన్లను కూడా పెట్టాం. ఐనా తట్టుకోలేను అన్నాడు..దాంతో ఏదో అలా కనిచేసాం..అని మూవీ డైరెక్టర్ కృష్ణ భగవాన్ అన్నారు. ఇక ఈ మూవీ ప్రొడ్యూసర్ గా జ్యోతి మాట్లాడుతూ " ఈ సినిమా కోసం అన్నీ సమర్పించేసుకున్నా" అనే డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పింది. తర్వాత మూవీ  హీరో పృథ్వి మాట్లాడుతూ "ఈ సినిమాను చేయమని మా డైరెక్టర్ ఎంతో మందిని అడిగారు వాళ్లంతా ఛీ వద్దన్నారు..ఇక తప్పక నేను చేయాల్సి వచ్చింది" అని  చెప్పారు. కట్ చేస్తే ఇదంతా క్యాష్ షోలో ఒక సెగ్మెంట్ అన్నమాట. ఇక ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి కృష్ణ భగవాన్, పృథ్వి , జ్యోతి, కరాటే కళ్యాణి ఎంట్రీ ఇచ్చారు.  ఇలా  రావడంతోనే కృష్ణ భగవాన్ కామెడీను షురూ చేసేసారు. "అసలు మమ్మల్నిద్దరిని పిలిచారు కానీ వాళ్లిద్దరూ సరిపోతారు" అని జ్యోతి, కరాటే కళ్యాణి మీద కౌంటర్ వేశారు.

"ఇంత తెల్లగా ఉన్నారు...ఏం పౌడర్ వాడతారేమిటి" అని జ్యోతి పృథ్విని అడిగేసరికి "నువ్వు వాడిందే నేను వాడతాను" అన్నాడు.."నేను మా రూమ్ మేట్స్ ది వాడతాను" అని కృష్ణ భగవాన్ మళ్ళీ పంచ్ వేశారు. ఇక ఈ షోలో "సుమ మెడికల్ క్యాంపు" పేరుతో ఒక సెగ్మెంట్ చేసింది. పృథ్వి గారు ఆ రోజుల్లో అర్జునరెడ్డి..తెలుసా  అని సుమ అనేసరికి అదేంటి ఆయన డాక్టర్ కదా అని జ్యోతి అడిగింది. ఇక ఇవన్నీ విన్న కృష్ణభగవాన్ పృథ్వి పశువులకు అర్జునరెడ్డి అనేసరికి ఆయన షాకైపోయాడు. ఇలా  రాబోయే వారం క్యాష్ షో ఫుల్ కామెడీని పంచనుంది.