English | Telugu

య‌ష్, వేద‌కు ఖుషి ఆచూకీ చెప్పిన చిట్టి!

కొంత కాలంగా ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ 'ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం'. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్నారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, రాజా శ్రీ‌ధ‌ర్‌, సులోచ‌న త‌దితరులు న‌టిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుందో ఒక‌సారి చూద్దాం. ఖుషీ క‌నిపించ‌క‌పోవ‌డంతో అభిమ‌న్యుపై అనుమానం వ్య‌క్తం చేస్తాడు య‌ష్‌. వెంట‌నే వెళ్లి అభిమ‌న్యుని నిల‌దీస్తాడు.

అభిమ‌న్యు మాత్రం ఖుషీని కిడ్నాప్ చేయాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేదంటాడు. అయినా స‌రే య‌ష్ వినిపించుకోకుండా అభిమ‌న్యుపై అరుస్తాడు. దీంతో మాళ‌విక మ‌ధ్య‌లోకి ఎంట‌ర‌వుతుంది. "ఖుషీ నా క‌న్న కూతురు. అలాంటిది త‌న‌ని కిడ్నాప్ చేయాల్సిన అవ‌స‌రం నాకు లేదు. ఖుషీ ఎక్క‌డుందో, ఎక్క‌డికి వెళ్లిందో గంట‌లోగా నాకు చెప్ప‌క‌పోతే మీ ఇద్ద‌రిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా" అంటూ బెదిరిస్తుంది. దీంతో అక్క‌డి నుంచి య‌ష్, వేద ఇంటికి వెళ‌తారు. ఖుషీ ఎక్క‌డికి వెళ్లింద‌ని వేద బాధ‌ప‌డుతూ ఇదంతా త‌న వ‌ల్లే జ‌రిగింది అని ఫీల‌వుతుంటుంది.

నీ త‌ప్పేమీ లేద‌ని ఇదంతా త‌న‌ వ‌ల్లే జ‌రిగింద‌ని య‌ష్ వేద‌ని ఓదారుస్తుంటాడు. ఇంత‌లో పెట్ డాగ్ చిట్టి మెడ‌లో లెట‌ర్ తో ఇద్ద‌రి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. అది చూసిన య‌ష్‌, వేద ఒక్క‌సారిగా షాక్ అవుతారు. "ఖుషీ ఎక్క‌డ చిట్టీ?" అని అడుగుతారు. చిట్టీ (డాగ్‌) మెడ‌లో వున్నచీటీ తీసి ఇద్ద‌రు చ‌దువుతారు. "ఇద్ద‌రూ విడిపోతే మీకు లైఫ్ లో క‌నిపించ‌ను" అంటూ ఖుషీ అందులో రాస్తుంది. వెంట‌నే చిట్టీ స‌హాయంతో ఖుషీ వున్న చోటుకి య‌ష్, వేద వెళ‌తారు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. ఖుషీ అక్క‌డే వుందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.