English | Telugu

పంచదారలాంటి ప్రోగ్రాం పాడుతా తీయగా అన్న కీరవాణి


పాడుతా తీయగా షో గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఈ షోకి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎస్పీ చరణ్ హోస్టింగ్ కోసం ఈ షోని ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. దేశవిదేశాల్లో కూడా ఈ షోని చూసే అభిమానులు చాలామంది ఉన్నారు. ఐతే ఇప్పుడు లేటెస్ట్ ఈ పాడుతా తీయగా గ్రాండ్ ఫినాలేలోకి ఎంటరయ్యింది. ఈ ప్రోగ్రాం జూన్ 12 ఈటీవీలో ప్రసారం కానుంది.. ఈ షోకి కీరవాణి గారు వచ్చారు. ఆయన ఎంట్రీతో ఈ గ్రాండ్ ఫినాలే స్టేజి ఒక్కసారిగా మెరిసిపోయింది.

కీరవాణి గారికి చిన్నప్పటినుంచి కూడా పాలల్లో పంచదార వేసి బూస్ట్ కానీ, హార్లిక్స్ కానీ వేసుకుని తాగడమంటే చాలా ఇష్టమట. ఐతే పాలన్నీ తాగేసాక ఆఖరిలో కాస్త చక్కర మిగిలిపోతుంది కదా.. దాన్ని స్పూన్ తో తీసుకుని తినడాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ పాడుతా తీయగా గ్రాండ్ ఫినాలే అనేది ఆ పంచదార లాంటిది అంటూ పోల్చారు కీరవాణి గారు. ఇక ఈ షోలో మరింత రుచిని అందరం చూడబోతున్నాం అని చెప్పారు. ఈ పాడుతా తీయగా గ్రాండ్ ఫినాలే ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ లాస్ట్ సంచికలో కంటెస్టెంట్స్ మధ్య పోటీ ఎలా ఉండబోతోంది అని తెలుసుకోవాలంటే 12 వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.