English | Telugu

మా ఆయన ఆరడుగులు ఉండాలి...నటుడు కాకూడదు...ఎవరైనా ఉన్నారా ?    

ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఫుల్ జోష్ తో సాగింది. ఐతే ఈ షోలో కావ్య తనకు కాబోయే వాడి గురించి చెప్పింది.. 30 ఏళ్ళ వయసుండాలని చెప్పింది. ఎందుకంటే కావ్య తన వయసు ఇప్పుడు 27 అని చెప్పింది. ఇక హైట్ ఐతే 6.2 అడుగులు ఉండాలని, 100 కేజీల బరువుతో, నటుడు కాకుండా ఎవరైనా పెళ్ళికి పర్లేదు అని చెప్పింది. తర్వాత "కావ్య మీ ఆయనకు శాలరీ ఎంత ఉండాలి" అని శ్రీముఖి అడిగింది" దానికి హరి "అన్ లిమిటెడ్ లవ్" అనేసరికి "మరి ఫుడ్డు ఎవరు పెడతారు" అంటూ కావ్య అడిగింది.

అలాగే మంచి మనసు ఉండాలి ...నెలకు 3 లక్షల జీతం సంపాదించాలని ఆ డబ్బు మొత్తం తనకే ఇవ్వాలని చెప్పింది. ఇంతలో శ్రీముఖి "నెలకు మూడు లక్షలు వస్తే మీరు హ్యాపీగా ఉంటారు కదా" అనేసరికి "అడ్రెస్ పంపండి" అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వినిపించింది. "అడ్రస్ తెలుసు ఎక్కడ ఉంటారో తెలుసు అన్నీ తెలిసీ రావడం లేదు" అని శ్రీముఖి వెతకరించింది. "కానీ డబ్బు ఉండాలి ఇవ్వడానికి" అంటూ కావ్య కూడా అనేసింది..దానికి శ్రీముఖి "డబ్బు లేదా" అని అడిగింది "ఉన్నా వద్దులే" అని కావ్య చెప్పేసింది. అలాగే "నాకు కాబోయే వాడు క్లాసీగా ఉండాలి ..గడ్డం లైట్ గా ఉంటే బాగుంటుంది. చిల్లరగా బిహేవ్ చేయకుండా ఉండాలి. పాస్ట్ లో ఎన్ని స్టోరీస్ ఐనా ఉండనివ్వండి కానీ మేము అతని లైఫ్ లోకి వెళ్ళాక మళ్ళీ అవి రిపీట్ కాకూడాదు కొత్తవి క్రియేట్ అవ్వకూడదు...ఇక నన్ను చేసుకోబోయేవాడు తానూ మాత్రమే కాదు వాళ్ళ ఫామిలీ కూడా అమ్మాయికి అమ్మాయి ఫామిలీకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి.." అంటూ చెప్పింది కావ్య.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.