English | Telugu

సీఎంపై కస్తూరి ఫైర్‌.. కామెంట్స్ వైర‌ల్‌!

ఒకప్పటి హీరోయిన్ కస్తూరి ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారి, సీరియల్స్ తో బిజీ అయ్యారు. స్టార్ మాలో ప్రసారమవుతోన్న 'గృహాలక్ష్మి సీరియల్ లో కస్తూరి లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సమాజంలో ప్రతి విషయంపైనా ఆమె స్పందిస్తూ ఉంటారు. స్వతహాగా న్యాయవాది కావ‌డంతో కస్తూరి అన్ని విషయాలపైనా అవగాహనతో మాట్లాడుతుంటారు. మరీ ముఖ్యంగా రాజకీయ విశ్లేషణలో ముందుంటారు. సినీ, రాజకీయ విషయాలపై కస్తూరి శంకర్ చేసే కామెంట్స్ వివాదాస్పదమవుతుంటాయి.

గతేడాది లాక్ డౌన్ నుండి కస్తూరి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లిపై ఆమె చేసిన కామెంట్స్ తమిళనాడులో వివాదానికి దారి తీశాయి. అయితే చివరికి ఆ మూడో పెళ్లి కూడా పెటాకులు అవ్వడంపై కస్తూరి కౌంటర్ వేశారు. ప్రస్తుతం ఈమె కరోనా వైరస్, దేశ ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఆక్సిజన్ కొరత వంటి విషయాలపై వేస్తోన్న కౌంటర్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె కేరళ సీఎం పినరయి విజయన్ ప్రమాణ స్వీకారంపై కామెంట్ చేశారు.

రెండోసారి వ‌రుస‌గా ముఖ్యమంత్రి అయిన‌ పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం వేడుక‌కు మొత్తం 500 మంది హాజరయ్యారు. దీని గురించి ప్రశ్నిస్తూ.. అదే ఓ కామన్ మ్యాన్ విషయంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే.. సంతాపం తెలిపేందుకు 20 మందికి మించి మాత్రం అనుమతివ్వరా..? అంటూ ప్రశ్నించారు. 'అన్ని జంతువులు సమానమే.. కానీ కొన్ని జంతువులు ఎక్కువ సమానం' అంటూ కౌంటర్ వేశారు. "ప్రమాణ స్వీకారం బడ్జెట్ తో ఎంత మందికి కరోనా వ్యాక్సిన్ వేయొచ్చో తెలుసా..?" అంటూ కస్తూరి మండిప‌డ్డారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.