English | Telugu
Karthika Deepam2 : నా కూతురి జోలికి వస్తే పీక కోస్తా.. దీప ఉగ్రరూపం!
Updated : Jun 6, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -63 లో..... పారిజాతం తన కూతురి మనసుని పాడు చేస్తుందని తెలుసుకున్న సుమిత్ర తన కూతిరికి దూరంగా ఉండమని పారిజాతంతో అంటుంది. అత్తయ్య నా కూతురి జీవితాన్ని ఏం చేయాలి అనుకుంటున్నారు. ఎందుకు లేని పోనివి చెప్పి దాని మనసు పాడు చేయాలని చూస్తున్నారని సుమిత్ర అడుగగా.. దాని మనసు పాడు చేస్తున్నది నేను కాదు ఆ దీప. ఆ దీపని నెత్తిన పెట్టుకుంది నేను కాదు నువ్వు. నువ్వు అలా చూస్తూ ఉండూ ఏదో ఒకరోజు దానివల్లే నీ కూతురు జీవితంలో సంతోషం పోతుందని పారిజాతం అంటుంది.
అత్తయ్య నా కూతురు జీవితంలో ఎలా సంతోషం పోకుండా చూడాలో నాకు తెలుసు దయచేసి మీరు దానికి దూరంగా ఉండండి. ఇది రిక్వెస్ట్ కాదు వార్నింగ్ అని సుమిత్ర అనగానే.. ఓహో కథ.. వార్నింగ్ ఇచ్చేదాకా వెళ్లిందా. దీప కార్తీక్ల మధ్య పైకి కనిపించేది కాక మరేదో సంబంధం ఉందని పారిజాతం అంటుంది. మరోవైపు నరసింహా వాళ్ళింటికి దీప వెళ్తుంది. ఎందుకు వచ్చావని దీపని శోభ తిట్టగానే.. తన చెంపచెల్లుమనిపిస్తుంది దీప. కొట్టిన రెండు దెబ్బలకు దీప అంటేనే శోభ గజగజ వణికిపోతుంది. ఏంటే తెగ రెచ్చిపోతున్నావ్.. ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా అని నరసింహా అనగానే.. సరోపోలేదురా.. అని నర్శింహను నెట్టేస్తుంది. పక్కనే ఉన్న కూరగాయలు తన్నేసి కత్తిపీట పట్టుకొని వచ్చి నరసింహ మెడ మీద పెడుతుంది. ఇప్పుడు మాట్లాడురా అని దీప అంటుంది. ఏయ్ దీప నా కొడుకు మెడ మీద కత్తిపీట పెడతావా అని అనసూయ అనగానే.. అడ్డు వస్తే నీ గొంతు మీద కూడా పెడతాను అత్తయ్య. నేను మాట్లాడుతాను. నువ్వు అలా విను అంతే. నేను మీలా మాట తప్పే మనిషిని కాదు అత్తయ్య మాట మీద నిలబడతానని దీప అంటుంది. నేను నిన్ను కూతుర్ని చదివించాలి అని డబ్బులు అడిగానా.. లేదా ఓ దారి చూపించు అడిగానా.. లేదే.. నా బతుకు నేను బతుకుతుంటే బతకనివ్వను. అంతు చూస్తాను.. కూతురిని దూరం చేస్తాను అంటే సమాధానం ఫోన్లో కాదు గేటులు తన్నుకుంటూ వస్తుంది. తిట్టినా భరిస్తుంది.. కొట్టినా భరిస్తుంది. కదా అని నా కూతురు జోలికి వస్తే పీక కోస్తా. మీ ముగ్గురికి చెప్తున్నా నా బిడ్డ జోలికి ఎవరైనా వస్తే వాళ్లు ప్రాణాలతో మిగలరని దీప వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది.
మరోవైపు కార్తిక్ గురించి శ్రీధర్ ని కాంచన అడుగుతుంది. కాసేపటికి కార్తిక్ కి కాంచన ఫోన్ చేయగా.. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి శౌర్య ఒక్కర్తే ఉందని దీప వచ్చాక వస్తానని అంటాడు. కార్తీక్ అలా ఉండటానికి బయటి మనిషిలో ఆలోచించమని శ్రీధర్ చెప్తాడు. కాంచన దీపకు విడాకులు ఇప్పించమని అంటుంది. కాంచన భార్యని మోసం చేసిన ఏ భర్తను క్షమించను అని అంటుంది. దానికి శ్రీధర్ ఏంట్రా ఈ ఖర్మ అని అనుకుంటాడు. కార్తీక్ శౌర్యని తీసుకొని బయటకు వెళ్లి తర్వాత ఇంటికి వస్తాడు. ఇంతలో దీప వచ్చేస్తుంది. ఇక దీప రావడం రావడమే.. శౌర్యని అలాగే వదిలేశారని కనీసం ఏమైనా తినిపించాలని కూడా లేదా అని కార్తీక్ మీద సీరియస్ అవుతుంది. దాంతో తినేశా అని శౌర్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.