English | Telugu

Karthika Deepam2 : ఇకమీదట దీప భాద్యత కార్తిక్ దే.. ఆ ఇద్దరికి నచ్చలేదుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '.. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -37 లో....అనసూయని తీసుకొని దీప నర్సింహా దగ్గరికి వస్తుంది. నా కోడలికి అన్యాయం చేస్తావా అంటూ తన కొడుకుని మొదటగా నిలదీస్తుంది‌ అనసూయ. ఆ తర్వాత నరసింహ రెండో భార్య శోభ.. మా నాన్న నీ కొడుకుకి టాక్సీ కొనిచ్చాడు.. నాకు నగలు చేయించింది. అంతే కాకుండా కోటి రూపాయల ఈ ఇల్లు ఇచ్చిందని అనగానే అనసూయకి శోభపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

ఆ తర్వాత నర్సింహాపై దీప కోప్పడుతుంది. నువ్వు ఆగవే.. నీ భర్త కోసం నువ్వు ఇక్కడికి వచ్చావ్.. వాడు వెళ్ళమని అనగానే.. వెళ్ళిపోతావా అక్కడే ఉండి నీ కాపురం చక్కద్ధిద్దుకోకుండా? ఎందుకు ఆ కొంపలోకి వెళ్లి చేరావని దీపకే రివర్స్ అవుతుంది అనసూయ. ఆ తర్వాత శోభ, నర్సింహా, అనసూయ ముగ్గురు ఒక్కటై దీపనే తప్పుపడతారు. నేను నా కొడుకు దగ్గరే ఉంటాను.. ఇక్కడ నుండి వెళ్ళిపోమని అనసూయ అనగానే.. దీప షాక్ అవుతుంది. అనసూయని తన వైపుకి తిప్పుకోవాలని శోభ ప్రేమగా మాట్లాడుతుంది. అప్పులన్నీ నేనే చెల్లిస్తానని శోభ అనగానే.. నువ్వు ఇక వెళ్ళిపో మాతో నీకేం సంబంధం లేదంటు దీపని తిట్టి పంపిస్తుంది అనసూయ. ఆ తర్వాత ఇక నేను నా కొడుకే దగ్గరే ఉండొచ్చు.. ఆ దీప ఏమైనా నా సొంత తమ్ముడి కూతురు కాదు కదా.. నేనేందుకు బాధపడాలని అనసూయ అనుకుంటుంది. ఆ తర్వాత శోభ వచ్చి.. అత్తయ్య షాపింగ్ కి వెళదాం.. ఓ నాలుగు చీరలు తీసుకోండి అని అనగానే అనసూయ మురిసిపోతుంది.

మరొకవైపు దీపని ఇక్కడే వారం రోజులు ఉండమని చెప్పిన మాటలు జ్యోత్స్న గుర్తుకుచేసుకుంటుంది. అప్పుడే పారిజాతం వచ్చి ఇలా ఎవరైనా డల్ గా ఉంటారా పార్టీకీ వెళ్ళమని అనగానే శివనారాయణ వస్తాడు. శౌర్యని ఎత్తుకొని కార్తీక్ వస్తుంటే.. జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కోపంగా చూస్తుంటారు. సుమిత్ర, ధశరత్ లు బయటకు వెళ్తు.. మేమ్ వచ్చేవరకు ఇక్కడే ఉండమని కార్తిక్ కి చెప్తారు. దీప ఎందుకో బాధపడుతుంది తన బాధ్యత నువ్వు తీసుకున్నావ్ కదా.. ఆ బాధేంటో కనుక్కోమని కార్తీక్ కి శివనారాయాణ చెప్తాడు.. ఆ తర్వాత శౌర్యని తీసుకొని కార్తిక్ బయటకు వెళ్తుంటే.. మళ్ళీ జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కోపంగా చూస్తుంటారు. మరొకవైపు అనసూయ అంత తొందరగా చేంజ్ అయినందుకు దీప బాధపడుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.