English | Telugu

నిజం తెలుసుకున్న మోనిత‌..రౌడీల‌కు చుక్క‌లు చూపించిన కార్తీక్‌

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. కార్తీక్‌, దీప‌, మోనిత ల చుట్టూ తిరిగే రివేంజ్ ఫ్యామిలీ డ్రామా నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర ఈ సీరియ‌ల్ ని రూపొందిస్తున్నారు. ఊహించ‌ని మ‌లుపులు, ట్విస్ట్‌ల‌తో నిరంతరాయంగా సాగుతూనే వుంది. తాజాగా ఈ సోమ‌వారం 1221వ ఎపిసోడ్ లోకి ఈ సీరియ‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. శ్రీ‌వ‌ల్లి పురిటి నొప్పులు పడుతుంటే దీప చ‌లించిపోతుంది.

ఎలాగైనా త‌న‌కు వైద్యం చేయ‌మ‌ని భ‌ర్త డాక్ట‌ర్ బాబుని నిల‌దీస్తుంది. ఈ ఉప‌ద్ర‌వం నుంచి త‌ప్పించుకోవాల‌ని అంబులెన్స్‌కి ఫోన్ చేస్తాడు. దాంతో శ్రీ‌వ‌ల్లిని అంబులెన్స్ లో ఆసుప‌త్రికి తీసుకెళ‌తారు. సీన్ క‌ట్ చేస్తే మోనిత .. డాక్ట‌ర్ బాబు గురించే ఆలోచిస్తూ వుంటుంది. ఇలా ఆలోచిస్తూనే కార్తీక్ కు ఫోన్ చేస్తుంది. కానీ అది మ‌హేష్ ద‌గ్గ‌ర వుండ‌టంతో త‌ను లిఫ్ట్ చేస్తాడు. కార్తీక్ .. ఎక్క‌డున్నావ్‌.. ఏమైపోయావ్ అని అరుస్తుంది. దీంతో చిరాకొచ్చిన మ‌హేష్ కార్తీక్ ఎవడు అనేస్తాడు.

శ్రీ‌వ‌ల్లి ఎవ‌రు?.. కార్తీక్‌ని ఇబ్బందిపెట్టిన దీప‌

ఇంత‌కీ నువ్వు ఎవ‌డివిరా అంటుంది మోనిత‌... మ‌ర్యాద అంటూనే కార్తీక్ గురించి చెప్పాలంటే డ‌బ్బుల‌వుతాయంటాడు. అకౌంట్ నెంబ‌ర్ చెప్పు పంపిస్తా అంటుంది మోనిత‌. ఆ త‌రువాత మ‌హేష్ తాను చూసింది .. కార్తీక్‌, దీప పిల్ల‌ల‌తో క‌లిసి ఊరు విడిచి వెళ్లింది చెబుతాడు.. దీంతో విసుక్కున మోనిత సౌంద‌ర్య ఆంటీకి తెలిసే ఇదంతా జ‌రుగుతోందా? అని అనుమానిస్తుంది. క‌ట్ చేస్తే శ్రీ‌వ‌ల్లి ఇంటి సామాను చెట్టుకింద వుండ‌టం చూసిన కార్తీక్ వాటిని ఇంటికి చేర్చ‌బోతుంటాడు. ఇంత‌లో రుద్రాణికి సంబంధించిన ముగ్గురు రౌడీలు వ‌చ్చి `మేం ఎవ‌రిమో తెలుసా ` అంటూ కార్తీక్‌ని బెదిరించే ప్ర‌య‌త్నం చేస్తారు. మ‌నుషులే గా అని స‌మాధానం చెబుతాడు కార్తీక్‌. అడ్డు త‌గిలిన రౌడీల‌కు కార్తీక్ చుక్క‌లు చూపిస్తాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.