English | Telugu

హమ్మయ్య... అంజి చావలేదు! దీప ఏం చేసిందంటే...

అంజిని మోనిత చంపిందా? లేదా? అనే సందేహాల నడుమ 'కార్తీక దీపం' సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ ముగింది. చాలామంది అంజి చావకుండా ఉండాలని, మోనిత ఆటలు సాగకూడదని కోరుకున్నారు. వాళ్ళ కోరికలు గురువారం నాటి ఎపిసోడ్ లో నిజం కాబోతున్నాయి. అంజిని మోనిత చంపలేదు. మరి, ఏం చేసింది? భార్య ఎక్కడికి వెళ్లిందోనని టెన్షన్ పడుతున్న డాక్టర్ బాబు, ఇంటికి భార్య వచ్చిన తర్వాత ఏం చేశాడు? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ రోజు (ఆగస్టు 5, 2021) 1110 ఎపిసోడ్‌ను చూడాల్సిందే.

మోనిత చేతికి అంజి చిక్కిన సంగతి తెలిసిందే. అయితే, అతడిని మోనిత చంపలేదు. అతడిని చంపితే పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడుతుంది. తుపాకీతో బెదిరించి తన మనిషి ద్రాక్షారామం సాయంతో కిడ్నాప్ చేస్తుంది. అదంతా వంటలక్క రికార్డ్ చేస్తుంది. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక డాక్టర్ బాబు కంగారు పడతాడు.

సీన్ కట్ చేస్తే... మోనిత తన ఇంటికి వెళ్లిపోతుంది. ఆమెతో 'అమ్మా మీ కోసం నిన్న రాత్రి కార్తీక్ (డాక్టర్ బాబు) వచ్చారు' అని ప్రియమణి చెబుతుంది. ఎందుకొచ్చాడోనని టెన్షన్ పడుతుంది మోనిత‌. వంటలక్క పిన్ని భాగ్యం కూడా మోనిత దగ్గరకు వెళ్లి 'నిన్ను చంపడానికి కార్తీక్ కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు' అని అబద్ధం చెబుతుంది. పెళ్లిని ఆపడానికి మోనితను కిడ్నాప్ చేయాలనేది ఆమె ప్లాన్. అయితే, కార్తీక్ దగ్గర అంజి ఉన్నాడని చెబుతుంది. తన మనుషుల కస్టడీలో ఉన్న అంజిని కార్తీక్ దగ్గర ఉన్నాడని చెప్పడంతో భాగ్యం ఏదో నాటకం ఆడుతున్నదని మోనిత పసిగడుతుంది. డ్రామా మొదలుపెడుతుంది.

మరోవైపు ఇంటికి వెళ్లిన వంటలక్కను 'ఎక్కడికి వెళ్ళావ్' అని డాక్టర్ బాబు పదే పదే అడుగుతాడు. చివరకు, గట్టిగా నిలదీస్తాడు. అప్పుడు అంజిని మోనిత కిడ్నాప్ చేసినప్పుడు తీసిన వీడియోను డాక్టర్ బాబుకు వంటలక్క చూపిస్తుంది. ప్రజెంట్ అంజి ఎక్కడ ఉన్నాడో చెబుతుంది. అక్కడికి డాక్టర్ బాబు వెళ్తాడు. అంజిని చూసి షాక్ అవుతాడు. తర్వాత ఏం జరిగిందనేది శుక్రవారం ఎపిసోడ్ లో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.