English | Telugu

Jayam serial: చిన్ని చెప్పిన రాజకుమారుడు రుద్ర సర్.. షాక్ లో గంగ!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -65 లో చిన్ని దగ్గరికి గంగ వెళ్తుంది. మాట్లాడుతుంటే వీరు మనిషి గంగ తన అమ్మ ఫోటో పంపిస్తాడు. వెంటనే గంగ అతనికి ఫోన్ చేసి మా అమ్మకి ఏమైందని అడుగుతుంది. మీ అమ్మ ఇక్కడ పడి ఉంది. తన దగ్గరున్న కాగితం లో నీ నెంబర్ ఉంటే ఫోన్ చేసానని అతను చెప్తాడు. దాంతో చిన్నికి మళ్ళీ వస్తానని చెప్పి గంగ బయటకి వస్తుంటే .. రుద్ర ఎదురుపడతాడు.

నువ్వు నీ ఫ్రెండ్ ని కలిసి రా.. మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలని రుద్ర అంటాడు. సరే సర్ మా ఫ్రెండ్ ని కలిసి వస్తానని వెళ్తుంది కానీ వాళ్ళ అమ్మ గురించి చెప్పదు. చిన్ని దగ్గరికి రుద్ర వెళ్లి మాట్లాడతాడు. అప్పుడే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. చిన్నిని తీసుకొని రుద్ర మీటింగ్ దగ్గరికి వెళ్తాడు. మరొకవైపు వాళ్ళ అమ్మ దగ్గరికి గంగ వెళ్ళబోతూ.. రుద్ర అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. నీ బలహీనత అయిన నీ అమ్మని ఆయుధంగా చేసుకుని నీ శత్రువులు వాడుకుంటారు. ఏదైనా ఆలోచించాలని రుద్ర చెప్పిన మాటలు గుర్తుచేసుకొని ఆగిపోతుంది.

గంగ అతనికి ఫోన్ చేసి మా అమ్మ నీ దగ్గర లేదు.. నీ వేషాలు నాకు తెలుసు.. ఇంకొకసారి ఇలా చేస్తే రుద్ర సర్ కి చెప్తానని గంగ అతనికి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు మీటింగ్ లో చిన్నిని చదివిస్తున్న రుద్ర స్టేజిపై మాట్లాడతాడు. అది చూసి గంగ షాక్ అవుతుంది. అంటే నా రాజకుమారుడు రుద్ర సర్ ఆ అని గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.