English | Telugu

Jayam serial : గంగని ఇరికించిన వీరు.. రుద్రకి డౌట్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -51 లో.....శకుంతల వినాయకుడికి మొక్కుకొని గంగకి కొబ్బరికాయ ఇచ్చి రుద్రకి ఇవ్వమని చెప్తుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగ కొబ్బరి కాయ తీసుకొని వచ్చి రుద్రకి ఇస్తుంది. రుద్ర కొబ్బరికాయ కొడుతాడు. ఆ తర్వాత వీరు డిస్సపాయింట్ గా ఫీల్ అవుతుంటే అప్పుడే ఇషిక వచ్చి మాట్లాడుతుంది. మెల్లగా అత్తయ్యకి రుద్ర బావపై కోపం పోతుందని వీరూతో ఇషిక చెప్తుంది.

ఇక రుద్ర బావ ఒక్కడే ఈ ఆస్తులని ఏలుతాడని ఇషిక అంటుంది. మరుసటి రోజు ఉదయం.. రుద్రతో పాటు గంగ సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. రుద్ర క్యాబిన్ లోకి గంగ తనతో పాటు వెళ్తుంటే.. ఎక్కడికి నీకు ఒక చైర్ వేయమంటావా అని వెటకారం గా మాట్లాడతాడు. దాంతో గంగ కోపంగా రుద్రని తిట్టుకుంటుంది. గంగ వెనక్కి చూసేసరికి రుద్ర ఉంటాడు. గంగ భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ కి బదులు కల్తీ ఆయిల్ ని ఎవరో మార్చారని మక్కంని కంప్లైంట్ ఇవ్వమంటాడు రుద్ర. పోలీసులు ఎంక్వయిరీ కి వస్తారు. వీరు తన ప్లాన్ లో భాగంగా తన మనిషితో గంగ బ్యాగ్ లో కల్తీ ఆయిల్ ప్యాకెట్ పెట్టిస్తాడు. పోలీసులు అందరి బ్యాగ్ లు చెక్ చేస్తుంటే గంగ బ్యాగ్ లో కల్తీ ఆయిల్ పాకెట్స్ దొరుకుతాయి.

ఇలా చేశావేంటి గంగ అని వీరు అంటాడు. నాకు ఇప్పుడు అర్థం అయింది.. ఇలా చేస్తారని తెలిసే గంగని తీసుకొని వచ్చారు.. ఎవరో ప్లాన్ ప్రకారం గంగని ఇరికించి మా పేరుని దెబ్బ కొట్టాలనుకున్నారు ఎస్ ఐ గారు.. ఆ అమ్మాయి అలాంటిది కాదని పోలీసులకి రుద్ర చెప్తాడు. సీసీటీవీ ఫుటేజ్ మళ్ళీ రీకలెక్ట్ చెయ్యండి అని పోలీసులకి చెప్తాడు రుద్ర. తరువాయి భాగంలో ఇందుమతి తన నగలు పోయాయని పైడిరాజుపై డౌట్ పడుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.