English | Telugu

బిగ్ బాస్ 5లోకి 'జబర్దస్త్' భామ!

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. గతేడాది కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ.. జాగ్రత్తలు తీసుకుంటూ షోని పూర్తి చేయగలిగారు. అయితే ఈ ఏడాది పరిస్థితులు దారుణంగా మారడంతో నిర్వాహకులు కాస్త జంకుతున్నారు. మరోపక్క కరోనా రూల్స్ ను అతిక్రమించారని.. మలయాళ బిగ్ బాస్ సెట్ ను పోలీసులు సీజ్ చేసి, షో షూటింగ్‌ను ఆపేశారు.

దీంతో తెలుగు షో మరింత ఆలస్యం చేయాలని చూస్తున్నారట. ఇదంతా పక్కన పెడితే షోలో ఎవరిని కంటెస్టెంట్ లుగా తీసుకోవాలనే చర్చ ఇంకా జరుగుతోందని తెలుస్తోంది. కరోనా పరిస్థితులు సద్దుమణిగితే వీలైనంత త్వరగా షోని మొదలుపెట్టాలి కాబట్టి కంటెస్టెంట్ల లిస్ట్ రెడీ చేసుకొని వారితో డీల్ కుదుర్చుకొని సిద్ధంగా ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'జబర్దస్త్' బ్యూటీ వర్షను సంప్రదించారని సమాచారం.

సోషల్ మీడియాలో వర్షకి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈమెని టీవీ కోటా కింద బిగ్ బాస్ లోకి తీసుకోవాలని చూస్తున్నారట. ఆమెని తీసుకురావడం ద్వారా షోకి గ్లామర్ యాడ్ చేయాల‌నుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఆర్టిఫిషియల్‌ ఎఫైర్ పెట్టుకోవడానికి కూడా ఆమె ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే జబర్దస్త్ షోలో ఇమ్మాన్యుయేల్ తో అలాంటి ట్రాక్ ఒకటి నడిపిస్తోంది కాబట్టి వర్షని తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు!

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.