English | Telugu

ఇంతకూ 'జబర్దస్త్‌'కు ఏమైంది?

ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఇంటిల్లిపాది హాయిగా నవ్వించడానికి అన్నట్టు ఉండేది. కొన్నేళ్లు బాగానే నడిచింది. కానీ తర్వాత్తర్వాత దాని రేటింగ్ పూర్తిగా తగ్గిపోయింది. ఇందులో ఉన్న టాప్ కమెడియన్స్, జడ్జెస్ ఎవరికీ వారు ఈ వేదికను వదిలి తమకు వస్తున్న అవకాశాలతో, రకరకాల కారణాలతో షోని వదిలేసివెళ్లిపోతున్నారు. దీని కారణంగా జబర్దస్త్ కళ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. నిన్న మొన్నటి వరకు జబర్దస్త్ వేదిక నిండు గోదారిలా ఉండేది. కానీ ఇప్పుడు చాలా పాపులర్ పర్సన్స్ స్కిట్స్ లేకపోయేసరికి ఈ షో చ‌ప్పగా సాగుతోంది. ఇక ఇటీవల కొంతమంది ఆర్టిస్టులు మల్లెమాల సంస్థ గొప్పతనాన్ని డామేజ్ చేసేలా మాట్లాడుతున్నారు.

అలాగే జబర్దస్త్ అనేది కమెడియన్స్ వల్లనే బతికి బట్టకడుతోందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేసరికి ఈ షో రేటింగ్ అమాంతం కిందకు పడిపోయింది. అలాగే నాగ‌బాబు, రోజా.. ఇలా ఒక్కొక్కరు వెళ్లిపోయేసరికి ఈ కామెంట్స్ అన్ని నిజమేనేమో అని అనిపిస్తోంది. ఐతే ఇన్ని విషయాలను తట్టుకుని కూడా జబర్దస్త్ షో సక్సెసఫుల్ గా రన్ అవుతోంది. నాగబాబు వెళ్ళిపోయాక రోజా ఈ షో బాధ్యతలను సక్రమంగా నిర్వహించి మంత్రి పదవి వచ్చేసరికి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా ఈ షోకి గుడ్ బై చెప్పేసరికి ఈ షో కి ఉన్న ఒకే ఒక అందం కూడా పోయింది. ఈ పరిస్థితులను ఆలోచిస్తూ ఉంటే.. అసలు ఈ జబర్దస్త్ ఎటు పోతోంది అనే మీమాంస ఇప్పుడు అందరిలో మొదలయ్యింది.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.