English | Telugu

'పెళ్లి సందడి' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడంటే...

యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'పెళ్లి సందడి' చిత్రాన్ని టీవీల్లో వీక్షించేందుకు ఎదురుచూస్తున్న ప్రేక్షకులందరికీ ఒక శుభవార్త. వరుస టెలివిజన్ ప్రీమియర్స్ తో దూసుకెళ్తున్న ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'జీ తెలుగు', ఇప్పుడు 'పెళ్లి సందడి' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో మీ ఎదురుచూపుకి ముగింపు పలకనుంది. గౌరీ రోణంకి దర్శకత్వంలో రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా, దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, రఘు బాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా జూలై 17న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.

వివరాల్లోకి వెళితే, రాఘవేంద్రరావు ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారుడిగా,ద్రోణాచార్య అవార్డుగ్రహీతగా వశిష్ఠ అనే పాత్రలో నటించగా, యుక్తవయస్సులోని వశిష్టగా రోషన్ అదరగొట్టాడు. వశిష్ఠ (రాఘవేంద్ర రావు) తన జీవితకథను వివరిస్తుండడంతో కథ మొదలవుతుంది. వశిష్ఠ విధి కంటే సంకల్పశక్తే గొప్పదని నమ్మితే, సహస్ర (శ్రీలీల) విధే అన్నింటికీ కారణం అని విశ్వసిస్తుంది.

ఐతే, వీరిద్దరూ ఒక పెళ్లిలో కలుసుకొని ప్రేమలో పడతారు. కానీ, సహస్ర తండ్రి (ప్రకాష్ రాజ్) వారి ప్రేమను అంగీకరించపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అయితే, వశిష్ట, సహస్రజంట తనను తిరిగి ఎలా ఒప్పిస్తారన్నదే మూలంగా కథ సాగుతుంది. వశిష్ఠ మరియు సహస్ర మధ్య జరిగే సన్నివేశాలు, రవి బాబు, షకలక శంకర్, వెన్నెల కిషోర్ వంటి హాస్యనటుల అద్భుతమైన ప్రదర్శనలతో ఈ సినిమా ఆధ్యాంతం నవ్వులు పూయిస్తుంది. ఎం.ఎం కీరవాణి అందించిన సంగీతం అందరిని ఆకట్టుకోగా, కలర్ఫుల్ విజువల్స్ తో సినిమాటోగ్రఫీప్రేక్షకులను మెప్పించనుంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.