English | Telugu

కెవ్వు కార్తీక్ ఇంట్లో విషాదం.. తన తల్లి గురించి ఎమోషనల్ పోస్ట్

జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో కెవ్వు కార్తిక్ కూడా ఒక వ్యక్తి . అలాంటి కార్తిక్ ఇంట విషాదం నెలకొంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన తల్లి కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆమె మృతి చెందినట్లుగా కార్తిక్ చెప్పాడు. తన తల్లిని ఉద్దేశించి ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. "అమ్మ గత 5సంవత్సరాల 2 నెలలు గా కాన్సర్ ఏ భయపడే విధం గా కాన్సర్ పై అలుపెరుగనిపోరాటం చేసావ్ . . నీ జీవితం అంతా యుద్ధమే. . మమ్మల్ని కన్నావు నాన్న కి తోడుగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడవ్ .. అమ్మ ఈ 5 సంవత్సరాలనుండి ఎలా ఒంటరిగా పోరాడాలో నేర్పావు... నీ ఆత్మస్తర్యం నాలో ధైర్యాన్ని నిపింది. .

అన్ని నేర్పావు కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పలేదు ఎందుకు అమ్మ …మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ...మా అమ్మ కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికి నా పాదాభివందనం.." అని రాసుకొచ్చాడు. గతంలో కెవ్వు కార్తీక్ తల్లి ఎన్నోసార్లు బుల్లితెరపై కనిపించారు. కొంతకాలం ట్రీట్మెంట్ తీసుకున్నాక అంతా సెట్ అయ్యింది అనుకున్నారు. కానీ, ఈ మధ్య కెవ్వు కార్తీక్ వరుసగా తన తల్లి ఆరోగ్యం గురించి పోస్టులు పెడుతూ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్ధించమని వేడుకుంటున్నాడు. దీంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు .

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.