Read more!

English | Telugu

రాజ్, కావ్య శోభనానికి ముహూర్తం పెట్టిన‌ దుగ్గిరాల ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.‌ ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-54 లో...  సీతారామయ్య ‌గారు పంతులిని పిలిచి కొత్త జంటకి శోభనం ఫిక్స్ చేస్తారు. రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణని పిలిచి అమ్మమ్మ శోభనం ముహూర్తం గురించి చెప్పగా.. అయ్యో  అత్తయ్య.. రాజ్ ఇంకా భార్యగా  అంగీకరించలేదు. ఆ భాధ ఇంకా అలానే ఉంది. ఇప్పుడు ఎందుకు ఈ శోభనమని అడుగుతుంది అపర్ణ. ఎవరేం చెప్పినా వినేది లేదు.. ఈ రాత్రికి శోభనం‌ జరిగితీరుతుందని సీతారామయ్య చెప్పేసి వెళ్ళిపోతాడు.

కాసేపటికి అప్పుకి కాల్ చేస్తాడు రాహుల్.. నీకొక విషయం చెప్పాలి.. మీ అక్కకి మా అన్నకి అని చెప్తుండగా అప్పు దగ్గరి నుండి కనకం ఫోన్ లాక్కుంటుంది. ఏంటి బాబు అని కనకం అడుగగా..‌ శోభనం  గదిలో బెడ్ మీద పూలతో డెకరేట్ చేశామని కళ్యాణ్ చెప్పగా.. ఎంత మంచి శుభవార్త చెప్పారు బాబు అని కనకం సంతోషపడి ఫోన్ కట్ చేసి.. అప్పుతో కావ్యకి శోభనమని చెప్పేసి వెళ్ళిపోతుంది. అది జరిగే పని కాదులే అని అప్పు అనుకుంటుంది. 

 ఆ తర్వాత కావ్య తన‌ గదిలోకెళ్ళి శోభనం గురించి బాధపడుతుండగా అమ్మమ్మ వచ్చి... కావ్యని శోభనానికి రెడీ చేస్తానని చెప్తుంది. ఇప్పడెందుకు అమ్మమ్మ.. రాజ్ గారు నన్ను ఇంకా భార్యగా అంగీకరించలేదు. శోభనం గదికి రానిచ్చేవారైతే నేను ఈ స్టోర్ రూంలో ఎందుకుంటాను అమ్మమ్మ గారని కావ్య అంటుంది.  మీ మధ్య దూరం పోవడానికే ఈ ముహుర్తం పెట్టించాం. భార్యగా నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. తప్పదు.. ఇదే నీ ఇల్లు.. ఇక్కడే ఉండాలి.‌ఇక్కడే బతకాలి..‌ స్థిరత్వం కోసం.. అత్తవారింట్లో అస్తిత్వం కోసం.. వంశానికి ఒక వారసుడిని ఇచ్చే తొలిరాత్రి ఈ ఇంటికి నిన్ను కోడలిని చేస్తుంది. అవమానాలు, అనుమానాలు పక్కన పెట్టి శోభనానికి సిద్దంగా ఉండు.. మేం బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నామని అమ్మమ్మ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కావ్య.. ఏంటో అమ్మమ్మ గారు ఇలా చెప్పారు.. ఎలా జరిగేది అలా జరుగుతుంది.. ఆ దేవునిపై భారం వేసాను అని అనుకుంటుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.