English | Telugu

త్వరలో జీ తెలుగులో సూపర్ క్వీన్ సీజన్ 2

సూపర్ క్వీన్ సీజన్ 2 త్వరలో జీ తెలుగులో ప్రసారం కావడానికి సిద్దమయ్యింది. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళల కోసమే ప్రత్యేకించి రూపొందిస్తున్న ఎన్నో షోస్ లో ఇది కూడా ఒకటి. జీవితంలో ఎదురయ్యే అవరోధాలు, అవమానాలు ఎన్ని ఉన్నా ఎంతమంది వెనకగా నవ్వుకున్నా వెనకడుగు వేయకుండా.. జీవితంలో సక్సెస్ తో బుద్ది చెప్పి ఆడియన్స్ మనస్సులో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బుల్లితెర నటీమణులతో ‘సూపర్‌ క్వీన్‌’ అనే షో స్టార్ట్ అయ్యి సీజన్ 1 ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఇందులో పల్సర్ బైక్ కండక్టర్ ఝాన్సీ, నటి విద్యురామన్, మౌనిక యాదవ్, ప్రియాంక చౌదరి, యాంకర్ ప్రశాంతి, సుహాసిని, ఎస్తేర్, జబర్దస్త్ పవిత్ర, లిఖిత మూర్తి, అనాలా సుష్మిత..రాబోతున్నారు.

ఇక ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ వ్యవహరిస్తున్నాడు. "నా ప్రయాణం నా కోసం కాదు...నా గమ్యం నాది కాదు, నేను అనే పదం తప్ప..నేను అనే నిజం తెలీదు, నా ఓటమి ఎదురుగా వేల మంది, నా గెలుపు వెనక నెన్నొక్కతిని, నా భయం నా ఓటమి ఎందరిని ఓడిస్తుందో అని, నా భాగ్యం నా గెలుపు ఎంత మందిని కుంగదీస్తుందో అని , నా నవ్వు కొందరిని బాధపెడుతోంది, నా బాధ ఎందరికో నవ్వునిస్తుంది, అందరూ ఉన్నా ఒంటరిని నేను..ఐనా నేను రాణిని నా జీవితానికి మహారాణిని" అంటూ యాంకర్ ఉదయభాను బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చింది. "వాళ్ళ ఆవేదన సముద్రమంత లోతు..వాళ్ళ ఆప్యాయత కొండంత ఎత్తు... సివంగుల మధ్య సమరం ఆరంభం" అంటూ ఒక టాగ్ లైన్ ఇచ్చాడు ప్రదీప్...మరి ఈ సీజన్ 2 లో కంటెస్టెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తారో ఎవరు సూపర్ క్వీన్ అవార్డు ని అందుకుంటారో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.