English | Telugu

మందు, పెళ్లి, గన్ ఫైర్ కాన్సెప్ట్స్ తో ఎక్స్ట్రా జబర్దస్త్


ఎక్స్ట్రా జబర్దస్త్ మంచి ఎనెర్జీ ఇచ్చే స్కిట్స్ తో నెక్స్ట్ వీక్ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఫస్ట్ స్కిట్ గా కమెడియన్ బాబు పెళ్ళికొడుకు గెటప్ లో వచ్చాడు.. "ఖుష్భు గారు నీకెవరురా పిల్లనిచ్చేది అన్నారు కదా..ఇప్పుడు నాకు పెళ్లి జరుగుతోంది..అది మీరే చూడాలి" అన్నాడు. తర్వాత ఇమ్మానుయేల్ వర్ష వచ్చి ఎంటర్టైన్ చేశారు. వీళ్ళ మధ్యలో ఇమ్మానుయేల్ వాళ్ళ అమ్మ వచ్చింది "పెళ్లంతా నాశనం చేస్తున్నావ్ కదరా, తాగుబోతోడా" అని ఇమ్ముని అనేసరికి "క్వార్టర్ వేస్తే నేను మనిషి కాదు అనేసరికి నేను క్వాటరున్నర వేస్తాను" అని రివర్స్ లో చెప్పింది వాళ్ళ అమ్మ .

తర్వాత రాంప్రసాద్- సన్నీ భార్యభర్తలుగా స్కిట్ చేశారు..."ఈరోజు నాకు హాలిడే...బయటికి వెళ్లి చికెన్ పట్టుకొస్తాను..ఫ్రిజ్ లో బీర్ ఉంది" అని రాంప్రసాద్ చెప్పేసరికి "నువ్వు వచ్చేలోపు నేను తాగేస్తా" అని చెప్పాడు సన్నీ. "నాకు రేపటి నుంచి నువ్వే కంపెనీ" అని రాంప్రసాద్ సన్నీని ముద్దుపెట్టుకుంటాడు. దాంతో సన్నీ సిగరెట్ తాగి ముద్దు పెట్టకండి" అంటాడు కొంటెగా..."నేను సిగరెట్ తాగలేదే అనేసరికి మీరు కాదు నేను తాగాను" అంటాడు సన్నీ. ఇందులో బులెట్ భాస్కర్ శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలో ఒక సీన్ ని "బులెట్ హాస్పిటల్ " పేరుతో స్పూఫ్ గా చేసి చూపించారు. ఫైనల్ గా పటాస్ ప్రవీణ్ టార్జాన్ గెటప్ లో వచ్చి ఎంటర్టైన్ చేసాడు..ఒక బస్ ని హైజాక్ చేసి ఇద్దరిని గన్ తో కాల్చి చంపేసే సీన్ కి స్టేజి మీద అందరూ ఒక్కసారిగా షాకైపోయారు. నిజమైన గన్ తో కాల్చేసాడా అనే ఒక భ్రమను కలిగించాడు ప్రవీణ్...ఇంతవరకు ఇలాంటి షూటింగ్ సీన్స్ ఈ షోలో కనిపించలేదు. చెప్పాలంటే ఇలాంటి సీన్ ని బుల్లితెర మీద చూపించకూడదు. కానీ సెన్సార్ అనేది లేకపోయేసరికి ఎలాంటి సీన్ ఐనా కూడా చూపించేస్తున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.