English | Telugu

 ధీరజ్, ప్రేమల మధ్య గొడవ.. రామరాజు ఫైర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -278 లో......వేదవతిపై రామరాజు కోప్పడుతాడు. కోడళ్లకి నువ్వు అంటే భయం లేదు.. వాళ్ళందరూ గొడవ పెట్టుకుంటున్నారని రామరాజు అంటాడు.

ఆ తర్వాత రామరాజు భాగ్యం వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. భాగ్యం టెన్షన్ పడుతుంది. మరొకవైపు నాన్నకి డబ్బు విషయం ఎందుకు చెప్పావని ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు. ఆ వల్లి అక్క అన్ని మాటలు అంటుంటే నాకెలా అనిపిస్తుంది. నువ్వు ఎందుకు కలుగజేసుకోవడం అని ధీరజ్ అంటుంటే ఎందుకంటే నువ్వు నా మొగుడివి అని ప్రేమ అంటుంది. మరొకవైపు వేదవతి ముగ్గు వేస్తూ భద్రవతిని చూస్తూ తమ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది. అప్పుడే నర్మద వచ్చి ఏదో లవర్స్ అయినట్టు అలా చూసుకుంటున్నారని అంటుంది. ప్రొద్దున నర్మద ఆఫీస్ లో జరిగింది చెప్తుంది. నేను చేసింది తప్పా అని నర్మద అడుగుతుంది. లేదని వేదవతి చెప్తుంది.

మరొకవైపు భాగ్యం వాళ్ళకి రామరాజు ఫోన్ చేస్తుంటే.. లిఫ్ట్ చెయ్యరు. దాంతో శ్రీవల్లిని పిలిచి రామరాజు కోప్పడతాడు. మరొకవైపు అసలు బ్యాచిలర్ పార్టీ కోసం.. ఏం డ్రెస్ వేసుకోవాలని ప్రేమ ఆలోచిస్తుంటే నర్మద, వేదవతి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.