English | Telugu

 ధీరజ్, ప్రేమల మధ్య గొడవ.. రామరాజు ఫైర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -278 లో......వేదవతిపై రామరాజు కోప్పడుతాడు. కోడళ్లకి నువ్వు అంటే భయం లేదు.. వాళ్ళందరూ గొడవ పెట్టుకుంటున్నారని రామరాజు అంటాడు.

ఆ తర్వాత రామరాజు భాగ్యం వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. భాగ్యం టెన్షన్ పడుతుంది. మరొకవైపు నాన్నకి డబ్బు విషయం ఎందుకు చెప్పావని ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు. ఆ వల్లి అక్క అన్ని మాటలు అంటుంటే నాకెలా అనిపిస్తుంది. నువ్వు ఎందుకు కలుగజేసుకోవడం అని ధీరజ్ అంటుంటే ఎందుకంటే నువ్వు నా మొగుడివి అని ప్రేమ అంటుంది. మరొకవైపు వేదవతి ముగ్గు వేస్తూ భద్రవతిని చూస్తూ తమ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది. అప్పుడే నర్మద వచ్చి ఏదో లవర్స్ అయినట్టు అలా చూసుకుంటున్నారని అంటుంది. ప్రొద్దున నర్మద ఆఫీస్ లో జరిగింది చెప్తుంది. నేను చేసింది తప్పా అని నర్మద అడుగుతుంది. లేదని వేదవతి చెప్తుంది.

మరొకవైపు భాగ్యం వాళ్ళకి రామరాజు ఫోన్ చేస్తుంటే.. లిఫ్ట్ చెయ్యరు. దాంతో శ్రీవల్లిని పిలిచి రామరాజు కోప్పడతాడు. మరొకవైపు అసలు బ్యాచిలర్ పార్టీ కోసం.. ఏం డ్రెస్ వేసుకోవాలని ప్రేమ ఆలోచిస్తుంటే నర్మద, వేదవతి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.