English | Telugu

Illu illalu pillalu : ఉత్సవాల్లో రెండు కుటుంబాలు.. అతడిని చంపడానికి రౌడీలని సెట్ చేసిన విశ్వ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -62 లో..... రామరాజు ఊళ్ళో తన పరువు పోయిందని సంక్రాతి ఉత్సవాలకి వద్దు అంటాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ తనని ఒప్పిస్తారు. ఆ తర్వాత విశ్వ తన చెల్లిని మోసం చేసి ధీరజ్ పెళ్లి చేసుకున్నాడని కోపం తో కొంతమంది రౌడీలని కలిసి దీరజ్ ఫోటో చూపించి చంపమని చెప్తాడు.

ఆ తర్వాత ఇరు కుటుంబాలు సంక్రాతి ఉత్సవాలకి వస్తారు. ఇద్దరు ఎదురు పడతారు. ప్రేమ తన పుట్టింటి వాళ్ళను చూసి బాధపడుతుంది. సేనాపతి కన్నకూతురిని చూసి ఎమోషనల్ అవుతాడు. రెండు కుటుంబాలు కలిసి వస్తుంటే ఒకతను రెండు కుటుంబాలు కలిసి పోయాయి అంటుంటే.. అది ఎప్పటికి జరగదు అని సేనాపతి అంటాడు. మరి అటు ఉండాల్సిన మీ కూతురు ఇటు ఉంది కదా అని అతను అంటుంటే.. భద్రవతికి కోపం వస్తుంది. దాంతో అతని చెంపచెల్లుమనిపిస్తుంది. అతను తిక్కతిక్కగా మాట్లాడుతుంటే.. రామరాజు కూడా అతని చెంపచెల్లుమనిపిస్తాడు.ఆ తర్వాత విశ్వ రౌడీలని సెట్ చేసి పెడతాడు.

రామరాజు కుటుంబం పూజరి దగ్గరికి వెళ్లి అర్చన చేపిస్తారు. నర్మద, సాగర్ ల పేర్లు చెప్తాడు. దాంతో మనపై కోపం పోయిందని నర్మద, సాగర్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ప్రేమ, ధీరజ్ ల పేర్లని రామరాజు చెప్పడు. దాంతో వేదవతి చూసి ప్రేమ, ధీరజ్ లా పేర్లు చెప్తుంది. తరువాయి భాగంలో మీకు ఇష్టం లేకున్నా ఇకనుండి మీరు భార్యాభర్తలు ఈ పూజ చెయ్యండి అంటూ వేదవతి దగ్గర ఉండి ప్రేమ, ధీరజ్ లచే పూజ చేయిస్తుంది. అది భద్రవతి కుటుంబం చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.