English | Telugu

Illu illalu pillalu : ప్రేమ, ధీరజ్ ల లవ్.. ఆనందరావుని చూసిన తిరుపతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -246 లో.... ప్రేమ వర్షంలో తడుస్తుంటే నర్మద వచ్చి లోపలికి రమ్మంటుంది. నువ్వు నాతో మాట్లాడకు అక్క అని ప్రేమ అనగానే నర్మద షాక్ అవుతుంది. నేను ఆ వల్లి వాళ్ళ నిజస్వరూపం బయటపెట్టాలనుకుంటే ఇలా చేసావని నర్మదని కోప్పడుతుంది ప్రేమ. నర్మద బాధపడుతూ లోపలికి వెళ్తుంది. ప్రేమ వర్షంలో తడిసి లోపలికి వస్తుంది.

ప్రేమని చూసి ధీరజ్ తల తుడుచుకోమని టవల్ ఇస్తాడు. ప్రేమ సైలెంట్ గా ఉండడంతో ధీరజ్ ప్రేమ తల తూడుస్తాడు. జలుబు అవుతుందేమోనని వేడి నీళ్లు తీసుకొని వచ్చి ఆవిరి పట్టిస్తాడు ధీరజ్. అదంతా చూసి నేను ఎవరిని అని అడుగుతాడు. ప్రేమ అని ధీరజ్ అనగానే.‌ అలా కాదు నాపై ఇంత కేర్ చూపిస్తున్నావు.. పైగా వరలక్ష్మి వ్రతం రోజు నాకు చీర కొనుక్కొని వచ్చావని ప్రేమ అంటుంది కానీ ధీరజ్ మాత్రం సైలెంట్ గా బయటకు వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత నర్మద గదిలోకి వెళ్లగానే సాగర్ చిర్రుబుర్రులాడుతాడు. నా గురించి పట్టించుకోవా.. ఎప్పుడు ఫ్యామిలీ అంటావ్.. ముద్దు లేదు ముచ్చట లేదు అని సాగర్ అంటుంటే నర్మద మాత్రం చీర మార్చుకోవడానికి చీర సెట్ చేస్తుంటుంది.. నేను కడుతాను చీర అని నర్మద దగ్గరికి వస్తాడు సాగర్. మరుసటి రోజు ఆనందరావు ఇడ్లీ అమ్ముతుంటే తిరుపతి చూస్తాడు. నువ్వేంటి అన్నయ్య ఇడ్లీ అమ్ముతున్నావని అడుగుతాడు. మా ఆస్తులన్నీ పోయాయి కదా అందుకే అని అతను అంటాడు. సరే కానీ ఇడ్లీ తిను అని ఆనందరావు ఇవ్వగా.. నా చేతు కలశంలో ఉంది కదా.. నువ్వే తినిపించమని తిరుపతి అనగానే అతను తినిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.